हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Weather Report : తెలుగు రాష్ట్రాల్లో వచ్చేరెండు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు

Anusha
Weather Report : తెలుగు రాష్ట్రాల్లో వచ్చేరెండు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. ఎండలు, వడగాలులు, అకాల వర్షాలు, పిడుగులు ఇలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఎక్కువవుతున్నప్పటికీ, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి వర్షాలు కురవడానికి అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్ని చోట్ల పిడుగుల పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

అధిక ఉష్ణోగ్రత

శనివారం రాత్రి 8 గంటల సమయం లో కాకినాడ జిల్లా వేలంకలో 56.2 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. ఏలేశ్వరంలో 48.5, కోటనందూరులో 45.2, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 44.5 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో కనిష్టంగా 20 మిల్లీ మీటర్ల వరకు వర్షపాతం రికార్డు అయ్యింది. అనకాపల్లి జిల్లా లో 39.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల గోపవరం, శ్రీకాకుళం పొందూరులో 39.7 డిగ్రీలు చొప్పున అధిక ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. సాధారణ ఉష్ణోగ్రతతో పోల్చుకుంటే ఇది రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. వర్షాల వల్ల ఎండ తీవ్రత కొంత తగ్గినట్టయింది. నేడు ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడటానికి అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. కాకినాడ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడొచ్చని రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మరోవైపు ఎండ తీవ్రత కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

 Weather Report : తెలుగు రాష్ట్రాల్లో వచ్చేరెండు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు

ఈదురుగాలులతో వర్షాలు

పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు. వ్యవసాయ పనుల్లో ఉన్నవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.మహారాష్ట్ర నుండి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది.సోమవారం తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం,ఈ మేరకు తెలంగాణలోని పది జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నడిరోడ్డుపై వైసీపీ నేతకు దేహశుద్ధి: అసలేం జరిగింది?
0:17

నడిరోడ్డుపై వైసీపీ నేతకు దేహశుద్ధి: అసలేం జరిగింది?

కాలుష్యానికి కళ్లెం వేద్దాం

కాలుష్యానికి కళ్లెం వేద్దాం

పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం

పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం

శ్రీవారి బంగారం, వెండి డాలర్ల విక్రయాలపై కీలక నిర్ణయం

శ్రీవారి బంగారం, వెండి డాలర్ల విక్రయాలపై కీలక నిర్ణయం

రెండో రోజు కుప్పం పర్యటన

రెండో రోజు కుప్పం పర్యటన

ఇంధన శాఖలో 27 మందికి కారుణ్య నియామకాలు

ఇంధన శాఖలో 27 మందికి కారుణ్య నియామకాలు

త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

📢 For Advertisement Booking: 98481 12870