📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Amaravathi :అమరావతిలో నిర్మాణం కానున్న అతిపెద్ద స్టేడియం

Author Icon By Anusha
Updated: March 22, 2025 • 10:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచంలోనే మొదటి అతిపెద్ద క్రికెట్ స్టేడియం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియం, దీనిని ముందు సర్దార్ పటేల్ స్టేడియం అని పిలిచేవారు. ఇందులో 110,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్టు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.

1.25 లక్షల సీటింగ్ సామర్థ్యంతో భారీ స్టేడియం

1.25 లక్షల సీటింగ్ సామర్థ్యంతో స్టేడియం నిర్మించనున్నట్టు వివరించారు. భారీ స్టేడియం నిర్మిస్తుండటంతో దాని పక్కన ప్రజా రవాణా వ్యవస్థ కూడా అందుబాటులో ఉండాలన్న ఏసీఏ విజ్ఞప్తికి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఐసీసీ చైర్మన్ జైషా కూడా అనుమతినిచ్చినట్టు పేర్కొన్నారు.

ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ

విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు ఏసీఏ తరపున ఢిల్లీ కేపిటల్స్‌ను అడిగితే విశాఖలో స్టేడియం బాగాలేదని తిరస్కరించారని, దీంతో మంత్రి లోకేశ్ జోక్యం చేసుకుని స్టేడియాన్ని బాగు చేస్తే రెండు మ్యాచ్‌లు ఇస్తామని చెప్పారని శివనాథ్ గుర్తు చేశారు. అతి తక్కువ వ్యవధిలోనే స్టేడియంను అద్భుతంగా తీర్చిదిద్దినట్టు తెలిపారు.

రంజీ మ్యాచ్‌ల నిర్వహణ

మంగళగిరి స్టేడియాన్నే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా తీర్చిదిద్దాలని అనుకున్నామని, కానీ లోపల నిర్మాణ ప్రాంతం దెబ్బతినడంతో సాధ్యం కాలేదని చెప్పారు. కాబట్టి ఆ స్టేడియంను రంజీ మ్యాచ్‌ల నిర్వహణకు సిద్ధం చేస్తామన్నారు. ఏడాదిలో 150 రోజులపాటు ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు శివనాథ్ వివరించారు. 

జిల్లా స్థాయి అభివృద్ధి

విజయవాడ, కడప, విజయనగరంలలో క్రికెట్ అకాడమీలు ప్రారంభిస్తున్నామని, అరకు, కుప్పం, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో స్టేడియాలు ఏర్పాటు చేసి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ క్రికెట్ గ్రౌండ్ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు శివనాథ్ తెలిపారు.అమరావతిలో నిర్మించనున్న క్రికెట్ స్టేడియం ప్రపంచస్థాయి మైదానంగా మారనుంది.విశాఖ స్టేడియం పునరుద్ధరణ, మంగళగిరి స్టేడియాన్ని రంజీ మ్యాచులకు సిద్ధం చేయడం రాష్ట్ర క్రికెట్ అభివృద్ధికి దోహదం చేయనుంది.

#ACA #Amaravati #AndhraPradesh #ChandrababuNaidu #CricketStadium #ICC #IPL #Mangalagiri #SportsCity #Vizag Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.