📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

క్షమాపణలు చెప్పిన హీరో విశ్వక్ సేన్‌

Author Icon By Vanipushpa
Updated: April 10, 2025 • 8:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల కాలంలో సినిమా ఫంక్షన్స్‌లో రాజకీయా ప్రసంగాలు ఎక్కువైయ్యాయనే చెప్పాలి. ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీని టార్గెట్ చేసుకుని పలువురు విమర్శలు గుప్పించారు. రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌ను విమర్శించారు. దీంతో ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు నెగిటివ్‌గా వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

జరిగిన ఘటనకు క్షమాపణలు

హీరో విశ్వక్ సేన్‌తో పాటు దర్శకుడు మీడియా సమావేశం నిర్వహించి జరిగిన ఘటనకు క్షమాపణలు చెప్పారు. పృథ్వి మాట్లాడిన దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని, ఆయన ఏం మాట్లాడతారో మాకు తెలియదని, ఆయన మాట్లాడే సమయంలో తాము చిరంజీవిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లామని, ఆయన అలా మాట్లాడకుండా ఉండాల్సిందని, అయినప్పటికీ మా సినిమా స్టేజ్ మీద జరిగింది కాబట్టి తాము క్షమాపణలు చెబుతున్నామని విశ్వక్ సేన్ తెలిపారు. పృథ్వి చేసిన దానికి తమ సినిమాను బ్యాన్ చేయాలనడం సరైంది కాదంటూ విశ్వక్ సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. నా సినిమాకు మీ అందరి సపోర్టు కావాలని విశ్వక్ సేన్ కోరారు. విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పడంపై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.

హద్దులు దాటి మాట్లాడిన పృథ్వి

దీంతో బాక్సాఫీస్ వద్ద ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్‌గా నిలిచింది. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ సినిమా వేదికపై నుంచి కూడా పవన్ కల్యాణ్ అప్పటి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సినిమాపై కూడా వైసీపీ శ్రేణులు గట్టిగానే ఫైట్ చేశాయి.తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘లైలా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సమయంలో చిరంజీవి జై జనసేన అంటూ అక్కడకు వచ్చిన అభిమానుల్లో ఉత్సాహం నింపారు. అయితే నటుడు పృథ్వి సినిమా హద్దులు దాటి మాట్లాడారు. పృథ్వి చేసిన కామెంట్స్ ఇప్పుడు ‘లైలా’ సినిమాను ఇరకాటంలోకి నెట్టింది. పృథ్వి గతంలో వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. దీంతో ‘లైలా’ సినిమా ఈవెంట్‌లో వైసీపీని చులకనగా చేసి మాట్లాడారు.
పృథ్వి మాట్లాడుతూ..ఇందులో నేను మేక‌ల స‌త్తిగా చేశాన‌ని తెలిపారు. అయితే మేక‌లు ఎన్ని ఉన్నాయ‌ని షాట్ మ‌ధ్య‌లో అడిగితే 150 ఉన్నాయని తెలిపాను. షాకింగ్ ఎంటో కానీ సినిమా చివ‌రిలో లెక్కేస్తే మొత్తం 11 గొర్రెలు మాత్ర‌మే ఉన్నాయ‌ని తెలిపారు. ఇదేంటో అర్థం కాలేదని, అన్నీ సినిమాలో బ్రహ్మాండంగా పెట్టారంటూ కామెంట్లు చేశారు.

#telugu News Ap News in Telugu apologized Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today The hero Today news Vishwak Sen

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.