ప్రముఖులు ఒకే వేదికపై కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కోలీవుడ్కు చెందిన ప్రముఖ హీరోలు విజయ్ (Thalapathy Vijay), సూర్య, కార్తీ ఒకే వేదికపై వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకలో ఈ ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన పెళ్లి కార్యక్రమానికి హాజరైన ఈ ముగ్గురు స్టార్ హీరోలు, అక్కడ జగన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. రాజకీయాలు, సినిమాలు రెండు వేరు రంగాలైనప్పటికీ, ఈ భేటీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Read Also: RSS centenary : ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో బాలీవుడ్ సందడి, భగవత్పై కితాబు!

సోషల్ మీడియాలో వైరల్
వైసీపీ అధినేత జగన్ బంధువు వై.ఎస్. సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ రెడ్డి వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన స్టాలిన్, జగన్, విజయ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. జగన్, విజయ్ (Thalapathy Vijay)పక్కపక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించుకోవడం కెమెరాల కంటపడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: