తిరుమల Temple : ఏడుకొండల వేంకటేశ్వరస్వామికి (Lord Venkateswara) మరో ఇరవైరోజుల్లో ఆరంభంకానున్న సాలకట్ల వార్షిక బ్రహ్మోత్స వాలకు విచ్చేయనున్న సామాన్యభక్తులకు అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లుచేస్తున్నట్లు టిటిడి అదనపు ఇఒవెంకయ్యచౌదరి తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో మాఢవీధుల్లో ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు జరుగుతోందని, భక్తులకు అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు. ఉదయం, రాత్రి వాహన సేవలసమయంలో గ్యాలరీల్లో, మాఢవీధుల్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్ని విధాలా సదుపాయాలు ఉంటాయన్నారు. వైద్యసేవలు, మరుగుదొడ్లు, తాగునీరు. అన్నప్రసాదాలు, కాపీ, పాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఆలయ మాఢవీధుల్లో, ఆలయుం ముందు, వాహనమండపం ప్రాంతాల్లో ఆధ్యాత్మికతతో రంగవల్లులు తీర్చిదిద్దడం, బారీకేడ్లు, గ్యాలరీలు ఏర్పాటు, వంటి పనులు పూర్తిదశకు చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం ఆలయ మాఢవీధుల్లో పనులను టిటిడి అదనపు ఇఒ చిరూ మామిళ్ళ వెంకయ్యచౌదరి, సిఇ సత్యనారాయణ, (CE Satyanarayana) ఇఇ సుబ్రమణ్యం, సివిఎస్ ఒ మురళీకృష్ణ, విఎస్ రాజశేఖర్, ఆలయ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కలసి చౌదరి తనిఖీ చేశారు. మాఢవీధుల్లో భక్తులకు అసౌకర్యం లేకుండా మరింత ఏర్పాట్లుపై సూచనలు చేశారు. వాహనసేవలు జరిగే సమయంలో భక్తులు గ్యాలరీల్లోకి సులభంగా చేరుకునేలా, తిరిగి వెలుపలకు వెళ్ళేలా సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. రద్దీ నియంత్రణ, క్రమబద్ధీకరణ ప్రశాంతంగా ఉండాలన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :