📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Talliki Vandhanam: తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం తీసుకున్న తాజా కీలక నిర్ణయం

Author Icon By Sharanya
Updated: May 6, 2025 • 10:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తూ కీలకమైన రెండు పథకాలపై కార్యాచరణను వేగవంతం చేసింది. ముఖ్యంగా రైతులకు “అన్నదాత సుఖీభవ” పథకం మొదటి విడత నిధులు విడుదలకు సిద్ధమవుతుండగా, విద్యార్థుల తల్లులకు ఇచ్చే “తల్లికి వందనం” పథకం అమలు పై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ రెండు పథకాలూ సీఎం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ప్రధానంగా హామీ ఇచ్చినవే కావడం గమనార్హం. కాగా, ఇకే విడతలోనే అమలు చేస్తారా రెండు విడతలుగా చెల్లిస్తారా అనేది చర్చగా మారింది.

తల్లికి వందనం

తల్లికి వందనం పథకం ముఖ్య ఉద్దేశ్యం, విద్యకు ప్రోత్సాహం కల్పిస్తూ తల్లుల భాగస్వామ్యాన్ని గుర్తించడం. ప్రతి అర్హత గల విద్యార్థి తల్లికి ఏడాదికి ₹15,000 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయడం ఈ పథకం లక్ష్యం. ఈ విధంగా విద్యార్ధుల చదువులో తల్లుల భాగస్వామ్యం పెరిగి హాజరు, చదువు ఉత్సాహం, మరియు డ్రాప్‌ అవుట్ రేట్లు తగ్గే అవకాశం ఉంది.

విడతలలో చెల్లింపు పై చర్చ

ఈ పథకానికి సంబంధించి ఒకే విడతగా ₹15,000 చెల్లించాలా? లేక రెండు విడతలుగా ₹7,500 చొప్పున చెల్లించాలా అన్నది ప్రస్తుతం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చకు కారణం – అదే నెలలో “అన్నదాత సుఖీభవ” నిధులు విడుదల చేయాల్సిన పరిస్థితి. నిధుల మేనేజ్‌మెంట్ కోణంలో ఇది ప్రభుత్వానికి కీలకమైన నిర్ణయంగా మారింది. కాగా, తాజాగా చంద్రబాబు కూటమి నేతలతో టెలి కాన్ఫిరెన్స్ లో తల్లికి వందనం పాఠశాలల ప్రారంభానికి ముందే అమలు చేస్తామని స్పష్టత ఇచ్చారు. 2025- 26 బడ్జెట్‌లో రూ. 9407 కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేసారు. 2024-25 విద్యా సంవత్స రంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాధమికం గా 69.16లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చిన్నట్లు సమాచారం.

అమలులో నిబంధనలు

ఈ పథకం అమలులో విద్యార్థి హాజరు 75 శాతం పైగా ఉండాలి అనే నిబంధన కొనసాగించబోతున్నారు. గతంలో వైసీపీ ప్రభు త్వం నిర్దేశించిన మార్గదర్శకాల ను సమీక్షిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపు దారులు.. తెల్ల రేషన్‌ కార్డు లేనివారిని, 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్‌ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు. ఇక, ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియోగం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక, కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం తల్లికి వందనం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు తుది రూపుదిద్దుకుంటున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతకు పెద్ద పీట వేయనున్నారు. ఎలాంటి రాజకీయం లేకుండా అర్హులందరికీ సకాలంలో నిధులు జమ చేసేందుకు డిజిటల్ డేటాబేస్ ఆధారంగా వ్యవస్థను నిర్మిస్తున్నారు.

Read also: DSC : మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు

#GovtWelfareSchemes #GratitudeToMothers #MotherhoodMatters #SocialWelfare #Students #TallikiVandhanam #WomenEmpowerment Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.