📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

AndhraPradesh: గుంటూరు నుంచిస్పెషల్ రైలు..

Author Icon By Anusha
Updated: March 29, 2025 • 4:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టారు. పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించేందుకు, అలాగే పండగలు (ఉగాది, రంజాన్) కారణంగా స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మొత్తం 26 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

చర్లపల్లి – కన్యాకుమారి ప్రత్యేక రైళ్లు

ప్రయాణ ప్రారంభం: ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు,చర్లపల్లి నుంచి బయలుదేరు సమయం: ప్రతి బుధవారం రాత్రి 9:50 గంటలకు,కన్యాకుమారి చేరే సమయం: రెండో రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు, తిరుగు ప్రయాణం: ఏప్రిల్ 4 నుంచి జూన్ 23 వరకు, కన్యాకుమారి నుంచి బయలుదేరు సమయం: ప్రతి శుక్రవారం తెల్లవారు జామున 5:15 గంటలకు,చర్లపల్లి చేరే సమయం: మరుసటి రోజు ఉదయం 11:40 గంటలకు నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుత్తణి, కాట్పాడి, విల్లుపురం, తిరుచిరాపల్లి, మధురై, తిరునెల్వేలి, నాగర్‌కోయిల్ మొదలైన ప్రధాన స్టేషన్లు.

ఇతర రైళ్ల పొడిగింపు వివరాలు

తమిళనాడులోని పలు ప్రధాన నగరాలకు రాకపోకలు సాగిస్తోన్న ప్రత్యేక రైళ్లను పొడిగించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. నంబర్ 07191 కాచిగూడ-మధురై ఏప్రిల్ 7వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు పొడిగించారు. 07192 మధురై- కాచిగూడ ఏప్రిల్ 9 నుంచి మే 7వ తేదీ, 07189 నాందెడ్- ఈరోడ్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 4 నుంచి మే 2 వరకు పొడిగించారు. 07190 ఈరోడ్- నాందెడ్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 6 నుంచి మే 4 వరకు, 07435 కాచిగూడ- నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 4 నుంచి మే 2 వరకు, 07436 నాగర్ కోయిల్- కాచిగూడ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 6 నుంచి మే 4 వరకు, 07601 సికింద్రాబాద్- విల్లుపురం ఎక్స్‌ప్రెస్‌ ఏప్రిల్ 3 నుంచి మే 1 వరకు, విల్లుపురం- సికింద్రాబాద్ ఏప్రిల్ 4 నుంచి మే 2వ తేదీ వరకు పొడిగించారు.

గుంటూరు – హుబ్లీ ప్రత్యేక రైళ్లు

ఇప్పుడు తాజాగా గుంటూరు నుంచి కర్ణాటకలోని హుబ్లీకి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. ఈ నెల 31వ తేదీన రాత్రి 8 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరే నంబర్ 07271 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 9:20 నిమిషాలకు శ్రీ సిద్ధారూఢ స్వామిజీ హుబ్లీ స్టేషన్‌కు చేరుకుంటుంది.నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, నంద్యాల, డోన్, గుంతకల్, బళ్లారి, తోరణగల్లు, హొస్పేట్, మునీరాబాద్, గదగ్, అన్నిగేరి మొదలైన స్టేషన్లు.

రిజర్వేషన్

రైల్వే అధికారులు వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే అనేక రైళ్లను పొడిగించడంతో పాటు, కొత్త రైళ్లను ప్రవేశపెట్టారు. రిజర్వేషన్ చేసుకోవాలనుకునే వారు ముందే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది.

#HolidayTravel #IndianRailways #Pilgrimage #southcentralrailway #SummerSpecialTrains #TrainTravel Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.