📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

Author Icon By Vanipushpa
Updated: February 18, 2025 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహాశివరాత్రి కోసం తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు సిద్ధం అవుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శివ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. శైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు, ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

పొన్నం ప్రభాకర్ ఆదేశం
మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధికంగా వెళ్లే వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి దేవాలయాలకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. గత సంవత్సరం కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు చేయాలన్నారు. బస్టాండ్ ల వద్ద అధిక రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీ మునిశేఖర్, సీటీఎం శ్రీధర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్పలు పాల్గొన్నారు.


780 ప్రత్యేక బస్సులు
వేములవాడకు 780 ప్రత్యేక బస్సులు ఇప్పటికే వేములవాడకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారనే అంచనాల నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి మహాశివరాత్రి జాతరకు వేములవాడకు వచ్చే భక్తుల కోసం 780 ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో మహాశివరాత్రి జాతర జరగనుంది.
మహాశివరాత్రి మూడు రోజుల జాతర
కాగా, ఈ ఏడాది మరో వంద బస్సు సర్వీసును అదనంగా కేటాయించాలని నిర్ణయించారు. మహాశివరాత్రి మూడు రోజుల జాతర కోసం దాదాపు లక్ష మంది భక్తులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. దీంతో, ఈ మేరకు బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

#telugu News Andhra Pradesh Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Mahashivratri Paper Telugu News Special buses Telangana Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.