📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

కల కలం రేపుతున్న పవన్ కళ్యాణ్ పోస్ట్

Author Icon By Anusha
Updated: February 21, 2025 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సోషల్ మీడియా వేదికగా ఇతరులను కించపరిచేలా పోస్టులు పెట్టే వారికి తగినంత హెచ్చరికలు, కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు లక్ష్యంగా మారుతున్నారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై పెట్టిన ఒక ఎక్స్ పోస్ట్ పెద్ద చర్చనీయాంశంగా మారింది.మహా కుంభమేళాలో పుణ్య స్నానం చేస్తున్న పవన్ కళ్యాణ్ చిత్రాన్ని మరో సినీ నటుడు సంపూర్ణేష్ బాబుతో పోలుస్తూ సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో పోస్ట్ అయ్యింది.

పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం

ఇటీవల పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ హిందూ మహాసభ అయిన కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య అనా  కొణిదెల, కుమారుడు అకీరా నందన్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టీటీడీ సభ్యుడు ఆనందసాయితో కలిసి పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానం ఆచరించారు.

ఈ ఫోటోలను ఉపయోగిస్తూ హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి అభ్యంతరకరమైన పోస్ట్ చేశాడు. అతను పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం చేస్తున్న ఫోటోను మరో సినీనటుడు సంపూర్ణేశ్ బాబు ఫోటోతో కలిపి వ్యంగ్యంగా పోస్టు చేశాడు. ఈ పోస్టును చూసిన జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు తీవ్రంగా స్పందించారు.

కేసు నమోదు

జనసేన నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌పై ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై జనసేన నాయకుడు రిషికేష్ పోలీసులను ఆశ్రయించారు. రిషికేష్ ఫిర్యాదుతో కావలి రెండో పట్టణం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉపముఖ్యమంత్రిని కించపరుస్తూ ఇలా అనుచిత పోస్టు పెట్టడం పట్ల కూటమి నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.

ఆయన భార్య అనా కొణిదెల, కుమారుడు అకీరా నందన్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టీటీడీ సభ్యుడు ఆనందసాయితో కలిసి పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..‘‘భారతీయులంతా విభిన్నమైన జాతులు, తెగలు, సంప్రదాయాలను ఆచరిస్తున్నప్పటికీ సనాతన ధ ర్మం విషయంలో మాత్రం ఏకమవుతారు. సనాతన ధర్మం ఇలాగే భవిష్యత్తులోనూ పరిఢవిల్లాలి. ప్రపంచంలో ఇలాంటి మహా కార్యక్రమం ఇప్పటివరకు జరగలేదు. మహాకుంభమేళాలో జరిగిన కొన్ని ఘటనలు దురదృష్టకరం. సనాతన ధర్మాన్ని నమ్మే, పాటించే వారిపై ఇలాంటి సమయంలో కొందరు నేతలు ఇష్టానుసారం మాట్లాడటం బాధ్యతారాహిత్యమే. మహాకుంభమేళా నిర్వహణలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పని చేస్తోంది. సనాతన ధర్మం నమ్మే వారి మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడడం మంచిది కాదు’’ పవన్ పేర్కొన్నారు.

#Janasena #PawanKalyan #PoliticalNews #SocialMediaControversy #ViralPost Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.