📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Vijayasai Reddy : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్‌ నోటీసులు

Author Icon By sumalatha chinthakayala
Updated: April 15, 2025 • 2:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vijayasai Reddy : వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ లో జరిగిన అవకతవకలపై తాజాగా విచారణ కొనసాగుతోంది. పై టీడీపీ ఎంపీ ఏకంగా పార్లమెంట్ లో ప్రస్తావించడంతో ఈ కేసు సంచలనంగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కుంభకోణం పై విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్‌)ను ఏర్పాటు చేసింది. కాగా ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ వైసీపీ నేత విజయసాయి రెడ్డికి తాజాగా సిట్ నోటీసులు జారీ చేసింది.

కసిరెడ్డికి కూడా నోటీసులు

ఈ నెల 18న విజయవాడలోని సీపీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి అప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. కాగా ఈ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అయిన కసిరెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ తో పాటు పలు ప్రాంతాల్లో సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు తనిఖీలు చేశారు. ఈ కేసులో కసిరెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు.

మద్యం లైసెన్స్‌ల కేటాయింపులో అవకతవకలు

2019-2024 మధ్య వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో మద్యం విధానం లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. మద్యం లైసెన్స్‌ల కేటాయింపులో అవకతవకలు, నకిలీ మరియు నాసిరకం మద్యం ఉత్పత్తి, అమ్మకాలు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా బినామీ డిస్టిలరీల నుండి సబ్-స్టాండర్డ్ మద్యం కొనుగోలు చేశారు. దీంతో రూ. 20,000 కోట్లకు పైగా ఆర్థిక నష్టంతో పాటు రూ. 4,000 కోట్ల వరకు కిక్‌బ్యాక్‌లు (లంచాలు) సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాసిరకం మద్యం వల్ల ఆరోగ్య సమస్యలు, ఆల్కహాల్ వ్యసనం వల్ల ఆత్మహత్యలు పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా సూచిస్తోంది.

Read Also: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ!

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu MP Vijayasai Reddy Paper Telugu News SIT notices Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.