Sankranti Festival:తాడిపల్లిగూడెం, భీమవరంలో ఉదృతంగా సాగిన పందేలు

Read Time:  1 min
Sankranti Festival
Sankranti Festival
FONT SIZE
GET APP

కోట్లు కురిపించిన పందెం కోళ్లు

పశ్చిమగోదావరిజిల్లా : భోగి రోజున కోలాహాలంగా మొదలైన కోడి పందేలు సంక్రాంతి రోజున జోరందుకుని మూడవ రోజునా కొనసాగాయి. విశాలమైన దేరాల్లో పగలు రాత్రులు తేడా లేకుండా ఫట్ల మధ్య ఈ వందేలు నిరాటంకంగా కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా 600 పైగా బరులు ఏర్పాటు చేయగా 500 కోట్లు పైగా చేతులు(SankrantiFestival) మారినట్లు అందనా. చాలాచోట్ల నాయకులే కోడి పందేలను ప్రారంభించడం గమనార్హం. ఈ ఏదారి వందాల్లో బుల్లెట్లతో పాటు పలుచోట్ల కార్లు కూడా వందేనికి ఉపయోగించారు.

Read Also: Andhra Pradesh: అల్లుడికి 158 రకాల వంటకాలతో విందు

Sankranti Festival

పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పందెం నిర్వాహకులు ఒక వినూత్న ప్రయోగానికి తెరలేపారు. పందాలను జూదంలా కాకుండా ఒక స్పోర్ట్స్ టోర్నమెంట్ మాదిరిగా నిర్వహించారు. ఇక్కడ బెట్టింగ్లో నగదుకు బదులుగా, పందాల్లో గెలిదిన కోళ్ల యజ మానులకు ఖరీదైన బహుమతులు అందిస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో, చివరి రోజు విజేతకు ఏళం మహీంద్రా ధార్ వాహనాన్ని బహుమతిగా ప్రకటించారు.


రెండో రోజు విజేతకు రాయల్ ఎన్ఫీల్డ్ బైకు ఆఫర్ చేశారు. తణుకులో విజేతకు సంక్రాంతి రోజున ఎమ్మెల్యే చేతుల మీదు గా బుల్లెట్ అందించారు. అలాగే తా తాడేపల్లిగూడెంలోని సైటోయిన వెంకటరామయ్య అనే వ్యక్తి బరిలో జరిగిన కోడి వందేల్లో ఏకంగా రూ.కోటి 53 లక్షల పందెం పడింది. గుడి వాడ ప్రభాకర్ సేతువ, రాజమండ్రికి(SankrantiFestival) చెందిన రమేష్ డేగ మధ్య పందెం కుదిరింది. పోటాపోటీగా కొట్టుకున్న కోళ్లలో చివరికి రాజమండ్రి వాసి రమేష్ కు చెందిన డేగ గెలవడంతో కోటిన్నర రూపాయలు అతడి సొంతమయ్యాయి.

ఒక్క తాడేపల్లిగూడెం, భీమవరంలోనే కోట్లలో లావాదేవీలు జరిగి నట్లు సమాచారం. పందెం రాయుళ్లు చారి మొత్తాల్లో వం దాలు కడుతూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరోవైపు. అక్కడ పోలీసుల నిఘా ఉన్నప్పటికీ కోడిపందాలు ఇంత పెద్ద ఎత్తున జరగడం వింతల్లో వింతగా మారింది. కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రచారంలో హోరెత్తించిన పోలీసు యంత్రాంగం ఈ మూడు రోజులూ పతా లేకుండా పోయింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.