Politics : బిజెపిని బలోపేతం చేయడమే ధ్యేయం – రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్

Read Time:  1 min
BJP party meeting focused on strengthening the organization
BJP party meeting focused on strengthening the organization
FONT SIZE
GET APP

కర్నూలు :  రాష్ట్రంలో బిజెపి బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తు న్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పర్య టనలో ఆయన పాల్గొని నగరంలోని స్టేడియం వద్ద వాకర్స్ తో ఛాయ్ పే చర్చ నిర్వహించారు. స్థానికులు మాధవ్ కలిసి టీ తాగుతూ అనేక సమస్యలు ఆయన దృష్టికి తెచ్చారు. దేశ ప్రధా నమంత్రి నరేంద్రమోడీ (Narendra Modi) ఆధ్వర్యంలో దేశంలోని అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన తెలిపారు. చిన్న సమస్యలే పెద్ద యుద్దానికి దారితీస్తాయని అదేవిధంగా చిన్నమా ర్పులతో పెద్ద విజయాలు సాధిస్తామని బిజెపి బలోపేతానికి చిన్న చిన్న మార్పులతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా మని మాధవ్ తెలిపారు.

ఈసందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ బిజెపి జెండా గ్రామ గ్రామాన ఎగరాలి, ప్రపంచంలో ఏవరు సాధించని ఘనత బిజెపి సాధించిందన్నారు. వాజ్పేయి, నరేంద్రమోడీలు సాధారణ కుటుం బాల నుంచి వచ్చి దేశ ప్రధానులయ్యారంటే బిజెపి ఘనతే.

politics

నాలాంటి వాళ్లు రాష్ట్ర అధ్యక్షులు కావడం బిజెపిలోనే సాధ్యం. 21 రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో కలిసి బిజెపి సిఎంలు ఉన్నారు. ప్రపంచమంతా నరేంద్రమోడీని ఆదర్శంగా తీసుకుంటున్నారు. వివిధ దేశాల్లో ఉన్న భారతీయ మూలలు ఉన్న వారు సగర్వంగా బ్రతికేలా మోడీ చేశారు. ఆర్థికంగా భారత్ 11వ స్థానంలో ఉండగా మోడీ ప్రధాని అయ్యాక నాల్గవ స్థానానికి చేరింది. భారత్ మేక్ ఇన్ ఇండియాగా మారి కూటమి ఎగుమతిస్థాయికి చేరింది. గత ప్రభుత్వం పంచాయితీ నిధులు దారి మళ్లిం చిందని ప్రభుత్వం వచ్చాక నేరుగా పంచాయితీలకు నిధులు వస్తున్నాయి.

రాయల సీమ డిక్లరేషన్ అమలుచేస్తామని, శ్రీబాగ్ ఒప్పం దం ప్రకారం హైకోర్టు కర్నూలు ఏర్పాటు (politics) చేయాల్సింది. రాయలసీమపై ప్రత్యేక ఆలోచన చేయాలని బిజెపి కోరింది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు కూటమి ప్రభుత్వం మాత్రమే చేయగలదు. తుంగభద్ర ఎల్ఎల్సి నుండి లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా 70వేల ఎకరాలకు మాత్రమే నీరు అందుతుంది. అరాచక పాలనకు చరమగీతం పాడి కూటమిని గెలిపించారు. టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యే పార్థ సారధి, బిజెపి జిల్లా అధ్యక్షులు రామకృష్ణలు పాల్గొన్నారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Farmers : ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ-పియం కిసాన్ నిధులు జమ

Shravan

రచయిత గురించి

Shravan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.