విజయవాడ Polavaram : పోలవరం పునరావాస కాలనీల ఇళ్ల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన కోసం రూ.739 కోట్లతో టెండర్లు పిలిచామని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) వెల్లడించారు. పోలవరం నిర్మాణంతోపాటు భూసేకరణ, పునరావాసం పనులకు సమ ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ, పోలవరం పునరావాస పనులపై మంత్రి సమీక్షించారు.
పనుల పురోగతిపై సమీక్ష
ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. వర్షాకాలం, భారీ వరదల్లో సైతం డివాటరింగ్ చేస్తూ పోలవరం పనులు జరుగుతుండటంపై విదేశీ నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. బట్రస్ డ్యామ్తో ఎగువ కాఫర్ డ్యామ్ సీపేజ్ను కంట్రోల్ చేసి పనులు చేయగలుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్యాప్రోక్పిల్ పనులపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు, అదే సమయంలో మోడల్ డ్యామ్ను పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఏజెన్సీతోపాటు స్వయంగా ఇరిగేషన్శాఖ ఏర్పాటు చేసిన క్వాలిటీ కంట్రోల్ లేబరేటరీ, నాణ్యత పరికరాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

గోదావరి జలాల తరలింపుకు చర్యలు
పోలవరం ఎడమ, కుడి కాల్వల కనెక్టివిటీస్కు గ్యాంట్రీస్ సంఖ్యను పెంచి 2026 జూన్ కల్లా పూర్తి చేసేలా ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలించేలా పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పనులు వేగంగా జరుగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జాతీయ రహదారుల క్రాసింగ్ దగ్గర వంతెనల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ (Irrigation Special) సెక్రటరీ జి సాయిప్రసాద్, ఆర్అండ్ఆర్ కమిషనరు రామ్సుందర్రెడ్డి, అడ్వైజరు వెంకటేశ్వరరావు, ఇఎన్ సి నరసింహమూర్తి, ఎస్ఇ, ఇఇలు, ఏజెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు.
పోలవరం పునరావాస కాలనీల కోసం ఎంత మొత్తం టెండర్లు పిలిచారు?
రూ.739 కోట్లతో టెండర్లు పిలిచారు.
పోలవరం ఎడమ, కుడి కాల్వల కనెక్టివిటీ పనులు ఎప్పటికి పూర్తి చేస్తారని తెలిపారు?
2026 జూన్ నాటికి పూర్తి చేస్తారని మంత్రి తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Read also :