हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Pension : 1.20 లక్షల పింఛన్ల పునరుద్ధరణ – మంత్రి అచ్చెన్నాయుడు

Shravan
Pension : 1.20 లక్షల పింఛన్ల పునరుద్ధరణ – మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి (శ్రీకాకుళం జిల్లా) : రాష్ట్రంలో గత ప్రభుత్వం దుర్మార్గమైన పాలన కారణంగా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు (Minister Kinjarapu) అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మండలం తులసిపేట గ్రామంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా ఫింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఇంటి ఇంటికీ వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లా డుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. రూ.35 నుంచి ప్రారంభమైన పింఛను నేడు రూ.4 వేలు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. 64 లక్షల మందికి రూ.34 వేల కోట్ల రూపాయలను పింఛన్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందని అన్నారు.

Pension

రాష్ట్రంలో గత ప్రభుత్వం 1.20 లక్షల మందికి వితంతు పంఛన్లను తొలగించిందని, వాటిని నేడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పునరుద్ధరించామని తెలిపారు. వివిధ కారణాల రీత్యా కొన్ని తిరస్కరణ అయ్యాయని, వాటిని పరిశీలించి అర్హత ఉన్న వారికి మంజూరు చేయడం జరుగుతందని హమీ ఇచ్చారు. ఒక్కరోజే 1.09 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని, సంక్షేమ పథకాలతో దుసుకుపోతున్న కూటమి ప్రభుత్వం మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా రూ.3,156 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 5వేలు, కేంద్ర ప్రభుత్వం 2,000, మొత్తం 7,000 నేరుగా రైతుల ఖాతాలోకి వేస్తున్నట్లు తెలిపారు.

READ MORE :

https://vaartha.com/constable-results-police-constable-results-released-home-minister-anitha-announcement/andhra-pradesh/524682/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870