భారత రాజ్యాంగాన్ని గౌరవించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్(Jagan)మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. బహుశా వైసీపీకి వేరే రాజ్యాంగం ఉందేమోనని, అయితే అది తమ ప్రభుత్వంలో చెల్లదని ఆయన వ్యాఖ్యానించారు.

ఏపీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా క్యాంపస్
ఆంధ్రప్రదేశ్లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ) క్యాంపస్ను ఏర్పాటు చేసే ఆలోచన ఉందని పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో త్వరలోనే చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఎన్ఎస్డీ క్యాంపస్(National School of Drama Campus) ఒక చిన్నపాటి భారతదేశంలా ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. తనకు నటనలో శిక్షణ ఇచ్చిన గురువు సత్యమూర్తి ఈ సంస్థ గురించి ఎంతో గొప్పగా చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. సమాజంలో కళలకు సరైన ప్రోత్సాహం లేకపోతే హింస పెరిగే ప్రమాదం ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. సినీ రంగానికి అవసరమైన సౌకర్యాలు, రాయితీలపై తగిన కార్యాచరణ రూపొందిస్తున్నామని పవన్ స్పష్టం చేశారు.
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు అభినందనల
అంతకుముందు, నూతన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అపార అనుభవజ్ఞుడైన రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి పదవికి మరింత గౌరవాన్ని తీసుకువస్తారని, ఆయన నేతృత్వంలో రాజ్యసభలో అర్థవంతమైన చర్చలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీలో ఏ సంస్థ క్యాంపస్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది?
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ) క్యాంపస్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే ఆలోచన ఉంది.
పవన్ కల్యాణ్ నూతన ఉపరాష్ట్రపతి గురించి ఏమని వ్యాఖ్యానించారు?
అపార అనుభవజ్ఞుడైన రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి పదవికి మరింత గౌరవాన్ని తీసుకొస్తారని ఆయన పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also:
Telugu News: RBI-ఫోన్ ఈఏంఐలు కట్టకపోతే లాక్ చేసే అధికారం