Pavan Kalyan : 345 మందికి పాదరక్షలు పంపిన పవన్ కళ్యాణ్

Read Time:  1 min
Pawan Kalyan sent footwear to 345 people
Pawan Kalyan sent footwear to 345 people
FONT SIZE
GET APP

Pavan Kalyan : సినీరంగంలో పవన్ కళ్యాణ్‌ అంతులేని అభిమానుల ప్రేమను చురగొన్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు డిప్యూటీ సీఎంగా ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 7న ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా లో డుంబ్రిగూడ లో పర్యటించిన విషయం తెలిసిందే.. అయితే, పెదపాడు గ్రామానికి వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్‌కు గ్రామస్తులు సాంప్రదాయ పద్ధతుల్లో భారీ స్వాగతం పలికారు. అందులో పాంగి మిత్తు అనే వృద్ధురాలు కూడా పవన్‌‌ను చూసేందుకు ముళ్లు, రాళ్లు ఉన్న కటిక నేలపై కాళ్లకు చెప్పులు లేకుండా అక్కడి వచ్చింది.

345 మందికి పాదరక్షలు పంపిన

ఆ పాదరక్షలను పవన్ సిబ్బంది డోర్ టూ డోర్ తిరిగి పంపిణీ

ఆ దృశ్యాలు చూసిన పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఎందుకు చెప్పులు వేసుకోలేదని పాంగి మిత్తును ప్రశ్నించగా.. అందరిదీ ఇదే పరిస్థితి అంటూ ఆమె బదులిచ్చింది. దీంతో వెంటనే ఆయన పెదపాడు గ్రామంలో ఎవరికైతే చెప్పులు లేవో.. వారి వారి సైజులు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన కార్యాలయం నుంచి సుమారు 345 మందికి పాదరక్షలను పెదపాడు గ్రామానికి పంపారు. అయితే, ఆ పాదరక్షలను పవన్ సిబ్బంది డోర్ టూ డోర్ తిరిగి పంపిణీ చేయగా.. గ్రామస్థులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Read Also: గుడ్ ఫ్రై డే సందర్భంగా సీఎం చంద్రబాబు సందేశం

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.