📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

కేరళకు చేరుకున్న పవన్ కళ్యాణ్

Author Icon By Vanipushpa
Updated: February 12, 2025 • 10:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన దక్షిణాది పర్యటనను ప్రారంభించారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి, కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన, దక్షిణ భారతంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. అక్కడి నుంచి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ 12, 13, 14 తేదీల్లో పర్యటనలు చేస్తారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్ని పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని తెలిసింది. ఈ పర్యటన వెనక బీజేపీ వ్యూహం ఉంది అనే వాదన వినిపిస్తోంది. బీజేపీ పెద్దల ఆదేశాలతోనే పవన్ కళ్యాణ్ ఈ టూర్ పెట్టుకున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
తన పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్.. కేరళ, తమిళనాడులో ఆలయాల్ని సందర్శిస్తారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా.. అనంత పద్మ నాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరమ రామస్వామి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలై, తిరుత్తీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్ని సందర్శిస్తారని తెలిసింది.

సనాతన ధర్మ పరిరక్షణలో పవన్ కళ్యాణ్ యాత్ర

ఈ పర్యటన ప్రధానంగా సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించినదిగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ 12, 13, 14 తేదీల్లో కేరళ, తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించనున్నారు. ఆయన పర్యటనలో ఈ ఆలయాలు ప్రధానంగా ఉన్నాయి:

రాజకీయ వ్యూహంలో భాగమేనా పవన్ కళ్యాణ్ టూర్?

ఈ పర్యటన వెనుక రాజకీయ కారణాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ వ్యూహం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ టూర్ ప్లాన్ చేశారని, పార్టీలోని కీలక నేతల సూచనల మేరకే ఆలయ సందర్శన చేస్తున్నారని భావిస్తున్నారు.దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన రాజకీయంగా, ఆధ్యాత్మికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ యాత్ర పవన్ రాజకీయ భవిష్యత్తుపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో చూడాలి.

#telugu News AP Deputy CM Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Pawan Kalyan reached Kerala Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.