📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

తెలంగాణ బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదు

Author Icon By Vanipushpa
Updated: February 12, 2025 • 4:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్ళకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి మరణిస్తుందటంతో తెలంగాణ అధికారులు అలెర్ట్ అయ్యారు. తెలంగాణా ప్రజలు చికెన్ తక్కువగా తినాలని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే తెలంగాణాలో బర్డ్ ఫ్లూ లేదని, ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు సైతం చెప్తున్నారు. అయినప్పటికీ పలు జాగ్రత్తలు తీసుకుంటున్న తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.
ఆ ప్రచారాన్ని నమ్మవద్దు
దాణా తెచ్చే వాహనాలు సైతం శానిటైజ్ చేసి కోళ్ళ ఫారాలకు అనుమతించాలని, శానిటైజ్ చెయ్యకుంటే ఇబ్బంది వస్తుందని అంటున్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గోపి వెల్లడించారు. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం ఇతర కారణాలతో కోళ్లు మరణించినట్టు ఆయన పేర్కొన్నారు. చికెన్ తినొచ్చా? అధికారులు చెప్తుందిదే తెలంగాణ రాష్ట్రంలో చికెన్ తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో చికెన్ తినకూడదని తప్పుడు ప్రచారం జరుగుతుందని, ఆ ప్రచారాన్ని నమ్మవద్దని వెల్లడించారు.

ఇతర కారణాలతో మృతి

వరంగల్, ఖమ్మం జిల్లాలో కోళ్ల మృతి పైన రక్త నమూనాలను ల్యాబ్ కు పంపించామని, అవి ఇతర కారణాలతో మృతి చెందినట్లు తేలిందని ఆయన అన్నారు బర్డ్ ఫ్లూ పై పౌల్ట్రీ రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. చికెన్ తింటే అలాగే తినాలి కోళ్ల ఫారాల చుట్టూ బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని, కోళ్ల నుంచి మనుషులకు ఈ వైరస్తోకే అవకాశం చాలా తక్కువ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.. బాగా చికెన్ ఉడికించి తినడం వల్ల వైరస్ బతికే ఛాన్స్ ఉండదని తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ సరిహద్దులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

ఏపీ నుండి వచ్చే కోళ్ళ వాహనాలు వెనక్కి

ఏపీ నుండి వచ్చే కోళ్ళ వాహనాలు వెనక్కు ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చే సరిహద్దుల్లో తనిఖీలు పెంచింది. కోదాడ మండలం రామాపురం చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ కొనసాగుతుంది. ఈ నెల 7తారీకు నుండి రాష్ట్ర బార్డర్ చెక్ పోస్టుల వద్ద నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి బర్డ్ ఫ్లూ లేకపోయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యాధి వ్యాప్తించకుండ చర్యలు తీసుకుంటున్నారు. పశు సంవర్ధక శాఖ అధికారులు కోళ్ళ ఫారాలను సందర్శించి రైతులకు సూచనలు చేస్తున్నారు.

#telugu News Ap News in Telugu bird flu case Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News registered Telangana Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.