हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Anil Chauhan: భారత సముద్రతీర రక్షణకు నూతన శక్తి: అనిల్ చౌహాన్

Shobha Rani
Anil Chauhan: భారత సముద్రతీర రక్షణకు నూతన శక్తి: అనిల్ చౌహాన్

భారత నౌకాదళం అమ్ములపొదిలోకి మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ తయారుచేసిన యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్-షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ ‘అర్నాల’ను విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్‌లో ఘనంగా ప్రారంభించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ (Anil Chauhan) ఈ నౌకను లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
జనరల్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ..
ఈ సందర్భంగా జనరల్ అనిల్ చౌహాన్ (Anil Chauhan) మాట్లాడుతూ, ఒకప్పుడు ఆయుధాల కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారత్, ఇప్పుడు వాటిని స్వయంగా తయారుచేసే స్థాయికి ఎదిగిందని అన్నారు. సముద్ర జలాల్లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. దేశీయ పరిజ్ఞానంతో ఇప్పటివరకు 98 యుద్ధ నౌకలను నిర్మించామని, ఇందులో ఐఎన్ఎస్ విక్రాంత్ (Vikranth) వంటి విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గాములు, ఫ్రిగేట్లు, కార్వెట్లు ఉన్నాయని వివరించారు. మరో 60 నౌకలు నిర్మాణ దశలో ఉండగా, 180 నౌకల నిర్మాణానికి ఒప్పందాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. కొత్తగా నౌకాదళంలో చేరిన ‘అర్నాల’ (Arnala) సవాళ్లను స్వీకరించగలదని, భారత తీర ప్రాంత రక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధార్కర్, వార్‌షిప్ ప్రొడక్షన్ అండ్ అక్విజిషన్ కంట్రోలర్ వైస్ అడ్మిరల్ రాజారామ్ స్వామినాథన్, జీఆర్ఎస్‌ఈ సీఎండీ కమొడోర్ పి. హరి తదితరులు పాల్గొన్నారు.

Anil Chauhan: భారత సముద్రతీర రక్షణకు నూతన శక్తి: అనిల్ చౌహాన్
Anil Chauhan: భారత సముద్రతీర రక్షణకు నూతన శక్తి: అనిల్ చౌహాన్

భవిష్యత్ నౌకలు: భారీ నిర్మాణ ప్రణాళికలు
ప్రస్తుతం 60 నౌకలు నిర్మాణ దశలో, 180 కొత్త నౌకల నిర్మాణ ఒప్పందాలు సిద్ధమవుతున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నౌకాదళాలలో భారత నౌకాదళాన్ని నిలబెడుతుంది. INS అర్నాల (Arnala) చేరికతో భారత నౌకాదళం తీర ప్రాంతాల్లో పటిష్టమైన పర్యవేక్షణ చేసే శక్తిని పొందింది. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న నౌకలు భారత రక్షణ వ్యవస్థను ఆత్మనిర్భర్ భారత్ దిశగా ముందుకు తీసుకెళ్తున్నాయి.

Read Also: Ambati Rambabu: అంబటి రాంబాబుపై కేసు నమోదు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870