Vijayawada : ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు

Read Time:  1 min
National award for Gollapudi Panchayat in AP
National award for Gollapudi Panchayat in AP
FONT SIZE
GET APP

Vijayawada : ఏపీలోకి చెందిన గొల్లపూడి పంచాయతీకి ఆత్మనిర్బర్ పంచాయతీ అవార్డు దక్కింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండంలోని గొల్లపూడి పంచాయతీ జాతీయ అవార్డు కొల్లగొట్టింది. సొంత ఆదాయ వనరుల అభివృద్ధి విభాగంలో అవార్డుకు ఎంపికైంది. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ వద్దే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఉన్నాయని తెలిసిందే. పవన్ కళ్యాణ్ శాఖకు జాతీయ అవార్డు రావడంతో జనసేన శ్రేణులతో పాటు కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ

ప్రధాని మోడీ చేతుల మీదుగా అవార్డుల అందజేత

జాతీయ పంచాయతీ అవార్డు 2025లో భాగంగా ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో ఈ నెల 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా అవార్డు ఇవ్వనున్నారు. బిహార్ లోని మధుబనిలో కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అవార్డుల అందజేత కార్యక్రమం జరగనుంది. సొంత ఆదాయ వనరుల అభివృద్ధి విభాగంలో జాతీయ స్థాయిలో గొల్లపూడి పంచాయతీ మూడో స్థానంలో నిలిచింది. దాంతో ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో ప్రత్యేక అవార్డుకు ఎంపికైనట్లు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి సంచాలకుడు, ఐఏఎస్ కృష్ణతేజ తెలిపారు.

చంద్రబాబు నాయుడు సర్కార్ హర్షం

ఇక, ఏపీలోని గొల్లపూడి గ్రామపంచాయతీకి జాతీయ అవార్డు రావడం పట్ల… చంద్రబాబు నాయుడు సర్కార్ హర్షం వ్యక్తం చేస్తోంది. గొల్లపూడి గ్రామపంచాయతీని… స్ఫూర్తిగా తీసుకొని అన్ని గ్రామాలు ఇలాగే ముందుకు వెళ్లాలని.. అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Read Also: భవనాన్ని ఖాళీ చేయండి..విశాఖ శారదాపీఠానికి టీటీడీ నోటీసులు

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.