Narendra Modi: సభా వేదికపైకి వచ్చిన మోదీ, చంద్రబాబు

Read Time:  1 min
Narendra Modi: సభా వేదికపైకి వచ్చిన మోదీ, చంద్రబాబు
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ 2025 మే 2న రాష్ట్ర పర్యటన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం”లో పాల్గొనేందుకు మోదీ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అమరావతిలోని రాష్ట్ర సచివాలయం సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు.

ఘన స్వాగతం:

హెలిప్యాడ్ వద్ద ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరంతా సభాస్థలికి బయల్దేరారు. ముందుగా గవర్నర్ మరియు పవన్ కల్యాణ్ వేదికపైకి వచ్చారు. అనంతరం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వేదికపైకి చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ధర్మవరంలోని చేనేత కళాకారులు ప్రత్యేకంగా తయారు చేసిన పట్టు శాలువా కప్పారు. కలంకారీ కళాకారులు తయారు చేసిన మోదీ చిత్రపటాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి ప్రధానికి బహుకరించారు. ప్రధాని మోదీతో పాటు సభావేదికపై రాష్ట్ర గవర్నర్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, పి.నారాయణ, నాదెండ్ల మనోహర్ కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం నారా లోకేశ్ ప్రసంగిస్తున్నారు.

Read also: Nara Lokesh: మోదీ సభలో ఉద్వేగపూరితంగా మాట్లాడిన నారా లోకేశ్

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.