ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్, నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాధాన్య అంశాలపై చర్చ జరిగింది.
పెట్టుబడుల ప్రోత్సాహానికి కేంద్రం సహకారం కోరిన లోకేశ్
సమావేశం సందర్భంగా, రాష్ట్రంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని లోకేశ్ ప్రధానిని అభ్యర్థించారు. ప్రత్యేకంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పరిశ్రమల స్థాపనకు కేంద్రం మద్దతు అవసరమని ఆయన కోరారు.

సెమీకండక్టర్ యూనిట్కు కృతజ్ఞతలు
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు మంజూరైన సెమీకండక్టర్ యూనిట్ (Semiconductor unit)కోసం ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ యూనిట్ ద్వారా రాష్ట్రానికి కీలక పెట్టుబడులు వచ్చే అవకాశముందని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు.
విద్యా రంగంలో సంస్కరణలపై చర్చ
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా రంగ సంస్కరణలు కూడా ఈ భేటీలో ప్రస్తావించబడ్డాయి. ఉన్నత విద్యను మరింత మానదండిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశం చేయాలని లోకేశ్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. గత 15 నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రధానికి సమగ్రమైన వివరణ ఇచ్చినట్లు సమాచారం. కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.
వికసిత్ భారత్ – 2047’లో ఆంధ్రప్రదేశ్ పాత్ర
‘వికసిత్ భారత్ – 2047’ లక్ష్యాన్ని సాధించడంలో ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమైన భాగస్వామిగా ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు. జీఎస్టీ సంస్కరణల వల్ల దేశ ప్రజలకు లభించిన లాభాలకూ ఆయన ప్రశంసలు గుప్పించారు. లోకేశ్ అడిగిన విజ్ఞప్తులన్నింటిపైనా ప్రధాన మంత్రి మోదీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రధాని భరోసా ఇచ్చారు.
‘యోగాంధ్ర’ కాఫీ టేబుల్ బుక్ బహుమతి
సమావేశం చివర్లో, ‘యోగాంధ్ర’ అనే పేరుతో రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ను మంత్రి లోకేశ్, ప్రధానిని బహుమతిగా అందజేశారు.
Read hindi news:hindi.vaartha.com
Read also: