Nara Lokesh: జగన్ తన పత్రికలో ఫేక్ ప్రచారం చేస్తున్నాడు: నారా లోకేశ్

Read Time:  1 min
Nara Lokesh: జగన్ తన పత్రికలో ఫేక్ ప్రచారం చేస్తున్నాడు: నారా లోకేశ్
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ప్రారంభించిన “తల్లికి వందనం” పథకం అద్భుత విజయం సాధించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) గారు పేర్కొన్నారు. ఈ పథకం లక్షలు మంది తల్లులకు నేరుగా ఆర్థికసహాయం అందించిందని అభిప్రాయపడ్డారు. పథకం ద్వారా తల్లుల కళ్లలో వచ్చిన ఆనందాన్ని చూసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కడుపుమంట మూడు రెట్లు పెరిగిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

జగన్ పత్రికలో ఫేక్ ప్రచారం..?

తల్లికి వందనం సూపర్ సక్సెస్! తల్లుల కళ్లలో ఆనందం చూసి జగన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలు పెరిగింది. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు. గ్రామ సచివాలయం, లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తరువాత మాత్రమే వారికి నిధులు విడుదల అవుతాయి.

“దొంగ లెక్కలు మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు” – లోకేశ్

దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు. మీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలే అందరూ చేస్తారు అనుకుంటే ఎలా? మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం చెయ్యనివ్వం. జగన్ రెడ్డి గారూ కడుపు మంటగా ఉన్నట్టుంది రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండి కాస్త తగ్గుద్ది” అంటూ ఎద్దేవా చేశారు.

తల్లికి వందనం పథకం

ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పేద కుటుంబాల్లోని తల్లులకు ప్రతి సంవత్సరం రూ. 15,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాలో నిధులు జమ చేస్తారు. దీని ప్రధాన ఉద్దేశ్యం – తల్లుల భాద్యతను గుర్తించటం, పిల్లల విద్య కోసం ప్రోత్సాహం ఇవ్వటం.

Read also: Nara Lokesh: ఫాదర్స్ డే సందర్భంగా నారా లోకేశ్ ట్వీట్

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.