📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ఏపీలో ఆశా వర్కర్లకు నారా లోకేష్ భరోసా!

Author Icon By Vanipushpa
Updated: February 15, 2025 • 1:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్‌ను విశాఖపట్నంలో ఆశా వర్కర్లు కలిశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని.. తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్ర సమర్పించి కోరారు. తమను విధుల నుంచి తొలగించకుండా కొనసాగిస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని ఆశా వర్కర్లు తెలిపారు. తమ సమస్యలను నారా లోకేష్ పరిష్కరిస్తారనే నమ్మకం ఉందని.. తాము ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నామన్నారు. కొంతమంది తమను విధుల నుంచి తొలగించాలని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని.. గత ప్రభుత్వ హయాంలో తమను కొందరు ఒత్తిడి తీసుకొచ్చి పార్టీ సమావేశానికి తీసుకెళ్లారని.. తమకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు.


తమను రాజకీయాల్లోకి లాగొద్దు

ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగించాలని కోరారు ఆశా వర్కర్లు. మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని.. మెప్మా, ఆర్పీల వ్యక్తిగత అకౌంట్లోకి డబ్బుల్ని జమ అయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా, విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో ఆర్పీలుగా తాము విధులు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. తాము ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంతో పాటుగా పేద మహిళలకు డ్వాక్రా గ్రూపులు పెట్టి, బ్యాంకు రుణాలు కూడా ఇప్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ సమావేశాలకు మహిళలను సమీకరించడం వంటివి కూడా తామే చేస్తున్నామన్నారు.

బ్యాంక్ అకౌంట్‌లలో జమ
తమకు ఇచ్చే జీతాలను వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేయాలని ఎన్నికల సమయంలో చంద్రబాబుకు తెలిపామని ఆశా వర్కర్లు గుర్తుచేశారు. తమకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారని.. ఆ హామీని కూడా అమలు చేయాలని కోరారు. అలాగే మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని.. తమ మీద పని ఒత్తిడిని తగ్గించాలని కూడా కోరారు. అలాగే పెరిగిన ధరలకు తగిన విధంగా వేతనాలు పెంచాలని కోరారు. తమపై రాజకీయ వేధింపులు లేకుండా చూడాలని.. పని భద్రత కల్పించాలని కోరారు. మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించారని వారు చెబుతున్నారు. కచ్చితంగా మంత్రి తమ సమస్యల్ని పరిష్కరిస్తారని ఆశా వర్కర్లు ధీమాను వ్యక్తం చేశారు.

#telugu News Andhra Pradesh Ap News in Telugu asha workers Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Nara Lokesh Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.