Nagalapuram Veda Narayana Swamy: చిత్తూరు జిల్లా నాగలాపురంలోని చారిత్రక శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయంలో ఆదివారం మహా సంప్రోక్షణ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆలయ పునరుద్ధరణ పనుల అనంతరం రాజగోపురానికి మరియు ప్రధాన ఆలయానికి ఆగమ శాస్త్రం ప్రకారం సంప్రోక్షణ నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విమాన రాజగోపుర సంప్రోక్షణను రుత్వికులు పూర్తి చేశారు.
Read Also: Ram Mohan Naidu: పూతలపట్టులో కేంద్ర మంత్రికి ఘన స్వాగతం
62 మంది రుత్వికులతో గర్భాలయ సంప్రోక్షణ అనంతరం ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గర్భాలయంలోని మూలమూర్తులకు 62 మంది రుత్వికులు అత్యంత వైభవంగా మహా సంప్రోక్షణ నిర్వహించారు. ఈ పవిత్ర ఘట్టాన్ని వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రమైన తమిళనాడు నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు.

టీటీడీ ఏర్పాట్లు – ఎస్వీబీసీ ప్రసారం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ వేడుకను వీక్షించేలా ఎస్వీబీసీ (SVBC) ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆలయ ప్రత్యేక అధికారి, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఎస్.ఈ. ఇంచార్జి నరసింహమూర్తి తదితర ఉన్నతాధికారులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: