📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Andhra Pradesh: ఈ నెల 20 నుంచి మున్సిపల్ ఉద్యోగుల సమ్మె

Author Icon By Anusha
Updated: May 7, 2025 • 4:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపిలోని మున్సిపల్ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. మే 20వ తేదీ నుంచి ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ఇప్పటికే అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. మంగళవారం మున్సిపల్ శాఖ అదనపు డైరెక్టర్‌ మురళీకృష్ణ గౌడ్‌కు మున్సిపల్ కార్మికుల సంఘం ప్రతినిధులు సమ్మె నోటీసులు ఇచ్చారు. కనీస వేతనాన్ని రూ. 26 వేలకు పెంచడంతో పాటుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనంగా 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ శాఖలో కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని తొలగిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో మే 20 నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు.

ఉపసంహరణ

2024లోనూ ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు. సమాన పనికి సమాన వేతనం సహా పలు డిమాండ్లను పరిష్కరించాలంటూ అప్పట్లో సమ్మె బాట పట్టారు. అనంతరం ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావటంతో సమ్మె విరమించారు. కార్మికుల కొన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు అప్పటి వైసీపీ సర్కారు అంగీకరించింది. రూ.15వేల జీతంతో పాటుగా హెల్త్ అలవెన్స్ రూ.6 వేలు కలిపి 21 వేలు ఇచ్చేందుకు అప్పట్లో ప్రభుత్వం అంగీకరించింది.అలాగే జీతం పెంపుదల సమయంలో కనీస వేతనాన్ని 21 వేలుగా పరిగణిస్తామని హామీ ఇచ్చింది. ఇక సమ్మెకాలంలో జీతం, కేసుల ఉపసంహరణకు అప్పట్లో ప్రభుత్వం అంగీకరించింది. అలాగే మున్సిపల్ కార్మికులు ప్రమాదవశాత్తూ చనిపోతే అందించే పరిహారం మొత్తాన్ని కూడా రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు పెంచుతామని హామీ ఇస్తారు. దీంతో అప్పట్లో మున్సిపల్ కార్మికులు సమ్మెను విరమించుకున్నారు.

కార్మికుల

తాజాగా మరోసారి మున్సిపల్ కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వటం ప్రాధాన్యం సంతరించుకుంది. కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలనే డిమాండ్‌తో పాటుగా పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ కార్మికుల సంఘం నోటీసులు ఇచ్చింది. మరోవైపు మున్సిపల్ కార్మికులతో చర్చలు జరిపే ఆలోచనలో పురపాలక శాఖ అధికారులు ఉన్నారు. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

Read Also :Pawan Kalyan: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు పవన్ కల్యాణ్ వార్నింగ్ ఎందుకంటే?

#AndhraPradesh #APMunicipalStrike #MinimumWageDemand #MunicipalWorkersStrike #WorkersProtest Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.