📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Tirupati: తల్లి అప్పు శిక్ష కొడుక్కి చివరికి మరణంతో విషాదం..

Author Icon By Anusha
Updated: May 22, 2025 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. 9 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు కాస్తా మరో మలుపు తిరిగింది.బాతులు మేపే పనికి అడ్వాన్స్ తీసుకున్న గూడూరు మండలం చవటపాలెంనకు చెందిన గిరిజన మహిళ అంకమ్మ తొమ్మిదేళ్ల కొడుకును యజమాని వద్ద తాకట్టు వస్తువుగా మార్చింది. తల్లి చెల్లించాల్సిన డబ్బు తీరేదాకా పసివాడిని పనిలో పెట్టుకున్న యజమాని దాష్టికం చూపించాడు.9 ఏళ్ల కొడుకు వెంకటేశులు ఆచూకీపై ఆందోళనతో తల్లి పోలీసులను ఆశ్రయించడంతో, విచారణలో ఈ దారుణం వెలుగు చూసింది. ఈ దారుణం.సత్యవేడు కు చెందిన బాతుల వ్యాపారి ముత్తు(Muthhu) వద్ద పని చేస్తూ అప్పుగా తీసుకున్న డబ్బు తీర్చలేక పోయింది. దీంతో 9 ఏళ్ల కొడుకును బాతులు మేపేందుకు వ్యాపారి ముత్తు వద్ద 9 నెలల క్రితం పనిలో పెట్టింది. బాతులు మేపే పనిలో ఉన్న కొడుకు తిరిగి తీసుకెళ్లేందుకు అప్పుగా తీసుకున్న రూ 40 వేలు సమకూర్చుకునే ప్రయత్నం చేసిన తల్లి అంకమ్మ గత నెలలో అప్పు తీర్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బాతుల వ్యాపారి ముత్తుకు పోన్ చేసి అప్పు కడతానని చెప్పింది. కొడుకును అప్పగించాలని కోరింది.

సమాచారం

కొంత సమయం కావాలన్న ముత్తు దాట వేసే ప్రయత్నం చేశాడు. నెలరోజులు గడుస్తున్నా కొడుకు ఆచూకీపై సరైన సమాచారం రాక పోవడంతో ఆరా తీసిన తల్లి అంకమ్మ వ్యాపారిని నిలదీసింది. మే 15వ తేదీన సత్యవేడు(Satyavedu)లోని ముత్తు కుటుంబ సభ్యులను అడిగింది. ముత్తు కుటుంబ సభ్యుల తీరుపై అనుమానం వచ్చి ఈ నెల 19 న పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడి అదృశ్యంపై ఆరా తీసిన పోలీసులు ఈ మేరకు బాతుల వ్యాపారి ముత్తు, అతని భార్య, కొడుకును విచారించారు. బాతులు మేపే క్రమంలో 40 రోజుల క్రితం అనారోగ్యానికి గురైన బాలుడు మృతి చెందినట్లు తెలిపిన ముత్తు అక్కడే పాతి పెట్టినట్లు చెప్పాడు.

Tirupati: తల్లి అప్పు శిక్ష కొడుక్కి చివరికి మరణంతో విషాదం..

రిమాండ్

ముత్తు చెప్పిన వివరాలు ప్రకారం, కంచిలోని బాలుడికి వైద్యం చేసిన ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి ఆరా తీశారు పోలీసులు. అక్కడి సీసీ టీవీ పుటేజీ పరిశీలించి డాక్టర్లను విచారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గుర్తించారు. ఈ మేరకు ముత్తు తోపాటు భార్య, పెద్ద కొడుకును అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. 9 ఏళ్ల బాలుడిని వెట్టి చాకిరీ చేయించిన ముత్తు ఫ్యామిలీ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పలు అభియోగాలపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు సత్యవేడు పోలీసులు. మరోవైపు బాలుడి మృతదేహాన్ని వెలికి తీసి చంగల్ పట్టు ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

Read Also: Kumki elephants : పవనన్నకు నా శుభాభినందనలు: మంత్రి నారా లోకేశ్‌

#HumanRightsViolation #MissingChild #TirupatiNews Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.