విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court)లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ కారణంగా బెయిల్ పిటిషన్
లోక్సభ సభ్యుడిగా ఉన్న తనకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉందని, ఆ కారణంగా తాత్కాలిక బెయిల్ మంజూరు (Grant of bail)చేయాలంటూ మిథున్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన ఏసీబీ కోర్టు ఆయన వాదనను పరిగణనలోకి తీసుకుంది. మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరైనప్పటికీ, సెప్టెంబర్ 11న తిరిగి కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణ కోసం ఆ తేదీన కోర్టులో సమర్పించుకోవాలని స్పష్టం చేసింది.
Read hindi news:hindi.vaartha.com
Read also: