📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

మంత్రులకు సీఎం దిశా నిర్దేశం.

Author Icon By Anusha
Updated: April 8, 2025 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశం జరిగిన తరువాత మంత్రులతో వేరుగా భేటీ అయ్యారు.పలు కీలక అంశాలను పేర్కొన్నారు. అందరూ గేర్ మార్చాలని.. పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు . మంత్రుల ఫైల్స్ క్లియరెన్స్‌పై పెర్ఫార్మెన్స్‌ను సీఎం చదివి వినిపించారు. మొదటి ఆరునెలలు పర్వాలేదని…. ఇక ఊరుకునేది లేదన్నారు. ఫైల్స్ క్లియరెన్స్‌లో సాక్షాత్తు ముఖ్యమంత్రి 3వ స్థానంలో ఉన్నారు. శాఖలపరంగా ఇక మీరు పెర్ఫార్మెన్స్ పెంచాలి. అందరు గేర్ అప్ కావాలి. కేంద్ర బడ్జెట్ వచ్చింది.. మార్చ్‌లో మన బడ్జెట్ వస్తుంది. ఢిల్లీలో వివిధ శాఖల్లో మిగిలిపోయిన బడ్జెట్ ఉంటుంది.. ఆ నిధులను మనం తెచ్చుకోవాలి’’ అని సూచించారు.సచివాలయం సిబ్బందిలో ఐదుగురికి ఎంపిక చేసి ఒక్కో మండలానికి ఒక్కొక్కరిని పెట్టుకోవాలని.. వీళ్ళకు ఒక ప్రొఫెషనల్ ఉంటారని.. వీళ్ళకు ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటారని తెలిపారు. వీళ్లు జీఎస్‌డీపీపై దృష్టి కేంద్రీకరిస్తారని తెలిపారు. వాట్స్‌ ఆప్ గవరెన్స్‌కు మంచి స్పందన వస్తుందని అన్నారు.

రెగ్యులర్‌గా సర్వేలు చేయిస్తున్నానని.. అన్ని పథకాలపై ప్రజల నుంచి ప్రభుత్వానికి మంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుందన్నారు. దీనిని ఇంకా మరింత పెంచుకోవాలని చెప్పారు. ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభంకాక ముందే తల్లికి వందనం నిధులు వేస్తామని.. అలాగే డీఎస్సీ నియామకాలను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ద్రవ్యోల్బణంపై ఆర్థికశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ రెగ్యులర్‌గా మానిటరింగ్ జరిగాలన్నారు. దావోస్‌లో గ్రీన్‌ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీతో పాటు వివిధ అంశాలపై మంచి ఫీడ్ బాక్ వచ్చింది.. మన బ్రాండ్ ఇమేజ్ బాగుందని మంత్రులకు సీఎం చెప్పారు. పీఎం కిసాన్ క్రింద కేంద్రం ఇచ్చే రూ. 6వేలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.14వేలు కలిపి ‘ అన్నదాత సుకీభవ ‘ అందిస్తామని సీఎం తెలిపారు.

AndhraPradesh Ap Ap News in Telugu Breaking News in Telugu Cabinet meeting Chandrababu Naidu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.