📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను తొలగించం : మంత్రి డోలా

Author Icon By Anusha
Updated: February 18, 2025 • 4:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లోనిగ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగినీ తొలగించే ప్రసక్తే లేదని, అవసరమైతే కొత్త ఉద్యోగులను నియమిస్తామని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. సచివాలయంలో ఆయా ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన సమావేశమైన సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పటికే చర్యలు ప్రారంభించామని, ఈ ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగుల రేషనలైజేషన్‌ ప్రక్రియపై ఐదారు సార్లు సమీక్ష నిర్వహించామని, జనాభా ప్రాతిపదికన సచివాలయ ఉద్యోగులను ఏ, బీ, సీ క్యాటగిరీలుగా నియమించాలని నిర్ణయించామని తెలిపారు. హేతుబద్దీకరణ తర్వాత అవసరమైన ఉద్యోగులను నియమించి, ఏ ఉద్యోగిపై భారం పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సరైన పదోన్నతి విధానాన్ని కూడా సులభతరం చేస్తామన్నారు. ఆలస్యం లేకుండా ప్రజలకు రియల్‌టైంలో సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు సచివాలయాల్లో ఏఐ, డ్రోన్‌ టెక్నాలజీ, ఐవోటీలను అమలు చేస్తామన్నారు. పదోన్నతులు, మిగిలిపోయిన ప్రొబేషన్‌ డిక్లరేషన్‌, జీతం స్కేల్‌, వివరణాత్మక జాబ్‌చార్ట్‌ అంశాలను ఉద్యోగ సంఘాల నేతలు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తెచ్చారు. సచివాలయ ఉద్యోగులకు జూనియర్‌ అసిస్టెంట్‌ పేస్కేల్‌ వర్తింపచేయాలని, వివిధ క్యాటగిరీల సచివాలయ ఉద్యోగుల పదోన్నతులు, ఇతర సర్వీసు విషయాల్లో స్పష్టత ఇవ్వాలని కోరారు. హేతుబద్దీకరణ ప్రక్రియలో ఇచ్చిన జీఓఎంఎస్‌ నెం.1లోని క్లాజ్‌ 3లో చెప్పినట్లు మల్టీపర్పస్‌ కార్యదర్శులు, టెక్నికల్‌, ఆస్పిరేషనల్‌ కార్యదర్శులు ఎవరెవరు ఏయే కేటగిరి కిందకు వస్తారో పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు.

రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి, వారి సమస్యలు, జీతభత్యాలు, పదోన్నతులు మరియు ఉద్యోగ మార్పులు వంటి కీలక అంశాలను సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో, 39 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పలు ముఖ్యమైన విషయాలపై చర్చలు జరిపారు.

జనాభా ఆధారంగా ఉద్యోగుల నియామకం

గ్రామ, వార్డు సచివాలయాలకు 3,500కి పైగా జనాభా ఉన్న సందర్భాల్లో, ఉద్యోగుల పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పేర్కొంటూ, 3,501 జనాభా దాటిన ప్రతి 500 లేదా 1,000 మందికి అదనంగా ఒక ఉద్యోగిని నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విధానం ద్వారా, ప్రతి సచివాలయానికి అవసరమైన మంది ఉద్యోగులను సమర్థంగా నియమించుకోవచ్చని వారు అభిప్రాయపడ్డారు.

జీత భత్యాలు

2022లో ఇచ్చిన 11వ పి ఆర్ సిప్రకారం, ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్‌ నెంబర్‌ 2లో సచివాలయ ఉద్యోగుల జీతభత్యాలు 2015 పీఆర్సీలోనివి యథాతథంగా ఉంచారని, ఈ తప్పు పునరావృతం కాకుండా రాబోయే 12వ పీఆర్సీలో సదరు సమస్యను సరి చూసే చర్యలు తీసుకోవాలని కోరారు. 2015 పీఆర్సీలో కేటాయించిన జీతభత్యాలు సకాలంలో పెంచడం, పాత పీఆర్సీల్లోని తప్పులను సరిచేయడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొనారు.రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు ఒకేసారి ఉద్యోగం పొందిన కారణంగా, చాలా మంది ఇప్పటి వరకు సరైన పదోన్నతికి నోచుకోలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. అందరినీ వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసి పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సచివాలయ ఉద్యోగుల సమస్యలను అంగీకరించి, వాటి పరిష్కారాలపై సమీక్షలు నిర్వహించాలని, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి, సర్వీస్ రూల్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.

#DolaBalaveeranjanayaswamy #EmployeeBenefits #GovernmentEmployees #MutualTransfers #PRC12 #PromotionPolicy #SachivalayamEmployees #SachivalayamReforms #WorkPressure Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.