Minister Atchannaidu: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు డెయిరీ వెన్నెముక

Read Time:  1 min
Minister Atchannaidu
Minister Atchannaidu
FONT SIZE
GET APP

విజయవాడ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు డైరీ రంగం వెన్నెముకగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్దక శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) అన్నారు. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ ప్రాంతంలో సదరన్ డైరీ అండ్ ఫుడ్ కాన్ క్లేవ్-2026 కార్యక్రమానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పాడి పరిశ్రమ ఉత్పత్తులను పరిశీలించి సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులకు నిత్య ఆదాయం, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించడంలో డైరీ రంగం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

Read Also: Rajya Sabha MPs Retirement: ఇద్దరు ‘పెద్దలు’ త్వరలో రిటైర్

Minister Atchannaidu
Minister Atchannaidu: Dairy is the backbone of the rural economy.

సన్నకారు రైతులకు పశుపోషణ ఆర్థిక భద్రతనిచ్చే మహిళా సాధికారత, గ్రామీణ ఉపాధులకు ప్రధాన ఆధారం మార్గంగా మారిందని, పాల ఉత్పత్తి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయని తెలిపారు. ప్రాచీన కాలం నుంచే పశుపోషణ మరియు డైరీ రంగం భారతీయ నాగరికత యొక్క ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక జీవితంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా డైరీ రంగం జాతీయ ఆర్థిక వ్యవస్థకే కాకుండా గ్రామీణ జీవనోపాధులకు, మహిళా సాధికారతకు, పోషకాహార భద్రతకు కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నారు. అందువల్ల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ అభివృద్దులను అన్వయిస్తూ డైరీ రంగాన్ని మరింత బలోపేతం చేయడం మన అందరి సమిష్టి బాధ్యత అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

డైరీ రంగాన్ని మరింత లాభదాయకంగా, సార్ధకంగా మార్చేందుకు శాస్త్రీయ మరియు సాంకేతిక పురోగతిని సమన్వయం చేస్తూ రంగాన్ని శక్తివంతం చేస్తున్న ఇండియన్ డైరీ అసోసియేషన్ చేసిన కృషిని మంత్రి(Minister Atchannaidu) హృదయపూర్వకంగా అభినందించారు. సదరన్ డైరీ అండ్ ఫుడ్ కాన్ క్లేవ్-2026 గొప్ప విజయాన్ని సాధించి, దేశ డైరీ రంగం పురోగతికి గణనీయమైన తోడ్పాటు అందిస్తుందని ఆకాంక్షించారు. ఫెలిసిటేషన్కు సరైన వ్యక్తిని ఎంపిక చేసినందుకు కూడా ఇండియన్ డైరీ అసోసియేషన్ ను అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. నారా భువనేశ్వరి, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, అలాగే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అని మంత్రి పేర్కొన్నారు.

మూడు దశాబ్దాల కృషి మరియు దూరదృష్టి గల నాయకత్వంతో హెరిటేజ్ ఫుడ్స్ భారతీయ డైరీ రంగంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఆమె నాయకత్వంలో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (వీదీ) ద్వారా ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ ను హెరిటేజ్ ఫుడ్స్ మూడు సార్లు పొందిందని మంత్రి గుర్తు చేశారు. నారా భువనేశ్వరి గారు కేవలం విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాకుండా, దయాగుణాలు కలిగిన ఉత్తమ. మానవీయ విలువలు గల వ్యక్తి కూడా అని అన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా, విద్య, ఆరోగ్యం, మహిళా యువజన అభివృద్ధి, విపత్తు సహాయం వంటి రంగాల్లో వెనుకబడిన వర్గాల సాధికారత కోసం ఆమె అంకితభావంతో సామాజిక సేవ చేస్తూ ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశంసించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.