📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: భారత ఆర్మీకి మంత్రాలయం మఠం విరాళం

Author Icon By Anusha
Updated: May 14, 2025 • 2:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం దేశానికి రక్షణగా ఉన్న జవాన్లకు అండగా నిలిచింది.దేశ రక్షణ నిధికి భారీ విరాళాన్ని ప్రక్రటించింది. ఈ మేరకు మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం రూ.25 లక్షల విరాళం ప్రకటించింది. మఠంలో పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు ఈ విరాళాన్ని ప్రకటించారు. సరిహద్దుల్లో సైనికుల త్యాగాలు మరువలేనివి. ఈ నేపథ్యంలో సైనికుల సంక్షేమానికి మా మఠం తరఫున రూ.25 లక్షలు అందజేయనున్నామన్నారు. దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తున్న భారత వీర జవాన్లకు అండగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశ రక్షణ నిధికి రూ.25లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడిలో హిందూ మతానికి చెందిన వారిని అడిగి మరీ దుర్మార్గంగా హత్య చేయడం బాధాకరమన్నారు. పహల్గాం దాడిలో మృతి చెందిన కర్ణాటక వాసులకు ఒక్కొక్కరికి మంత్రాలయం మఠం తరఫున రూ.లక్ష ఇచ్చిన విషయాన్ని తెలిపారు. భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణంలో జవాన్లు వీర మరణం పొందడం బాధాకరమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్రం దేశ సైన్య త్రిదళాలపతులు వీరోచిత పోరాటం చేసి పాకిస్థాన్‌ను కోలుకోలేనంత దెబ్బతీశారన్నారు. మన దేశం కోసం పోరాడుతన్న జవాన్లకు అండగా దేశ రక్షణ నిధికి రూ.25 లక్షలు అందజేస్తున్నట్లు పీఠాధిపతి చెప్పారు.

భారత ఆర్మీకి మంత్రాలయం మఠం విరాళం

సైనికుల

ఇటీవల ఆపరేషన్ సింధూర్‌లో మరణించిన శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన అగ్నివీర్ మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మురళీనాయక్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ తరపున రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు రూ.50 లక్షల సాయం అందించే కార్యక్రమాన్ని గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించిన కూటమి ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు వైఎస్ జగన్(YS Jagan. మురళీ నాయక్‌ వయసులో చిన్నవాడే అయినా దేశానికి స్ఫూర్తిగా నిలిచారన్నారు జగన్. యావత్‌ భారత్‌ గర్వపడేలా వీరోచితంగా పోరాడి దేశ రక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించిన వీరుడన్నారు.

Read Also : Andhra Pradesh: ఏపీలో కొత్తగా కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడంటే?

#indianarmy #KurnoolNews #Mantralayam #RaghavendraSwamyMath #SupportOurSoldiers Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.