Latest News : Railways New Rules రైళ్లలో లగేజీపై కొత్త నిబంధనలు – విమానాల తరహాలో కఠిన చర్యలు

Read Time:  1 min
Latest News : Railways New Rules రైళ్లలో లగేజీపై కొత్త నిబంధనలు – విమానాల తరహాలో కఠిన చర్యలు
FONT SIZE
GET APP

భారత రైల్వే(Railways New Rules) ప్రయాణికులకు త్వరలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.త్వరలో లగేజీ ఫై కొత్త నిబంధనలను అమలులోకి రానున్నాయి. విమానాశ్రయాల తరహాలో లగేజీ బరువుపై కఠినమైన తనిఖీలు నిర్వహించబడతాయి. పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లే వారికి అదనపు రుసుములు(Additional fees)లేదా జరిమానాలు వసూలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు జాతీయ మీడియా వెల్లడిస్తోంది.

ప్రధాన అంశాలు:

  • ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలు: దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో(Railways New Rules) ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలు ఏర్పాటు చేయబడతాయి. ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లే ముందు తమ లగేజీ బరువును తనిఖీ చేయించుకోవాలి.
  • అదనపు రుసుములు: నిర్ణీత పరిమితికి మించి బరువు ఉన్నా లేదా లగేజీ (Luggage Limit) పరిమాణం మరీ పెద్దగా ఉన్నా ప్రయాణికులు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే వారిని రైలు ఎక్కేందుకు అనుమతిస్తారు.

లగేజీ పరిమితులు (ప్రతిపాదిత):

  • ఏసీ ఫస్ట్ క్లాస్: 70 కిలోల వరకు ఉచితం.
  • ఏసీ 2-టైర్: 50 కిలోల వరకు ఉచితం.
  • ఏసీ 3-టైర్, స్లీపర్ క్లాస్: 40 కిలోల వరకు ఉచితం.
  • జనరల్ బోగీలు: 35 కిలోల వరకు ఉచితం.

ఈ నిబంధనలను ప్రయోగాత్మకంగా మొదట ఉత్తర మధ్య రైల్వే జోన్‌ పరిధిలోని స్టేషన్లలో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

ఇతర అభివృద్ధి పనులు:

రైల్వే శాఖ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆదాయాన్ని పెంచుకోవడం లక్ష్యంగా మరో అడుగు వేస్తోంది. ఆధునీకరించిన స్టేషన్లలో దుస్తులు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర ప్రయాణ ఉపకరణాలు విక్రయించే ప్రముఖ సింగిల్-బ్రాండ్ స్టోర్లను ప్రారంభించాలని యోచిస్తోంది.

Has Tags: news, latestnews, latest telugu news, telugunews, todaynews , breaking news

Read Also:

https://vaartha.com/gold-rate-today-gold-rates-have-fallen-again/today-gold-rate/533011/

Digital

రచయిత గురించి

Digital

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.