📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన లక్ష్మీపార్వతి

Author Icon By Anusha
Updated: March 2, 2025 • 6:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి అరెస్టు వ్యవహారంపై వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇటీవల రాయచోటి పోలీసులు పోసానిని అరెస్ట్ చేయడం, ఆయనపై 11 కేసుల వరకు నమోదవ్వడం తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, సినీ పరిశ్రమలో వర్గ వివక్షత పెంచేలా ప్రవర్తించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

లక్ష్మీపార్వతి మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ, గతంలో నంది అవార్డుల అంశంపై పోసాని చేసిన వ్యాఖ్యలలో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. ” అవార్డులను కేవలం ఒక వర్గానికి కట్టబెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ఎత్తిచూపినందుకు ఇప్పుడు ఆయనపై కేసులు పెట్టడం తగదని” అన్నారు.

అవార్డులు తిరస్కరించడం

భారతరత్న, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి జాతీయ అవార్డులను కూడా కొన్ని సందర్భాల్లో ప్రముఖులు తిరస్కరించారని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. ప్రముఖ గాయని ఎస్. జానకి గతంలో పద్మభూషణ్ అవార్డును తిరస్కరించిన ఉదాహరణను ఆమె ప్రస్తావించారు. “పోసాని తనకు వచ్చిన అవార్డును తిరస్కరించడంలో తప్పేముంది? న్యాయం జరగలేదనే భావనతో ఆయన అవార్డును అంగీకరించలేదు. కానీ ఆ విషయాన్ని ఇప్పుడు లేవనెత్తి, ఆయన్ను అరెస్ట్ చేయడం అన్యాయమని” లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోసాని అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొంటూ,అతని గొంతుకు ఆపరేషన్లు జరిగాయి, నెలల తరబడి వాక్కు రాక ఇబ్బంది పడ్డారు. అలాంటి వ్యక్తిని పోలీసులు వేధించడం సరికాదని లక్ష్మీపార్వతి విమర్శించారు. కేసు పెట్టిన కారణం మనోభావాలు దెబ్బతిన్నాయట మరి మీరు ఎన్టీఆర్‌కు చేసిన అన్యాయం నా మనోభావాలు, రోజా, జగన్, భారతమ్మ మనోభావాలు మీ వల్ల దెబ్బతినలేదా అంటూ టీడీపీని ప్రశ్నించారు.

టీడీపీ అరాచకాలు

మీరు సాగించిన అకృత్యాలు, అరాచకాలు, అన్యాయాలు.అన్నీ ఇన్నీ కావుతప్పులన్నీ మీరే చేస్తారు. పోలీసులపై మీరు చేసిన దాడులు ఎంత భయంకరమైనవో తెలియదా వాటిపై మాత్రం కేసులు ఉండవు.  వాటన్నింటినీ కొట్టేయించుకుంటారు. ఇవాళ తనకు అవార్డు వద్దన్నందుకు పోసానిని ఎక్కడో కడప జిల్లాలోని జైలులో పెడతారు. 65 ఏళ్ల వయసున్న వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారు. 

పవన్ గారూ మిమ్మల్ని అడుగుతున్నాను

ఆ రోజు ఆయన భార్యను మీరెంత విమర్శించారండీ! ఏరోజైనా ఆయన భార్య ఇంట్లోంచి బయటికి వచ్చిందా? అటువంటి ఆమెపై కూడా మీ మనుషులను పంపించి నిందలు వేయించారే. ఇప్పుడు కక్ష తీర్చుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారా. ఇదేం న్యాయమండీ పవన్ కళ్యాణ్ గారూ కొంచెమైనా మీరు ఆలోచించరా.చంద్రబాబు, లోకేశ్ ఇద్దరికీ ప్రజాస్వామ్య విలువల గురించి తెలుసునా కనీసం పవన్ కల్యాణ్ అయినా ఈ వ్యవహారంలో బుద్ధిగా ఆలోచించాలి. లేదంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తిగా నష్టం జరుగుతుంది” అని ఆమె హెచ్చరించారు.

#AndhraPradeshPolitics #APPolice #ChandrababuNaidu #LakshmiParvathi #Lokesh #PawanKalyan #PoliticalControversy #PosaniKrishnamurali #TDP #ycp Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.