Krishna District: టెన్త్ విద్యార్థులకు 10 గ్రాముల బంగారం ఫ్రీ

Read Time:  1 min
Krishna District: టెన్త్ విద్యార్థులకు 10 గ్రాముల బంగారం ఫ్రీ
FONT SIZE
GET APP

పదో తరగతి విద్యార్థులకు బంపర్ ఆఫర్, కృష్ణా జిల్లా ఉంగుటూరు జెడ్పీ హైస్కూల్‌లో ఫస్ట్ ర్యాంక్ వస్తే బంగారం గెలుచుకునే అవకాశం. (Krishna District) పదో తరగతి పరీక్షల్లో ఫస్ట్ వచ్చిన విద్యార్థికి 10 గ్రాముల బంగారం బహుమతిగా ఇస్తానని పారిశ్రామికవేత్త గుత్తా సుమన్‌ కుమార్‌ ప్రకటించారు. సుమన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలంలో ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు జెడ్పీ హైస్కూల్‌కు లక్ష రూపాయల విలువైన క్రీడా సామాగ్రిని అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని (Government school) విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ బహుమతుల వెనుక ఉద్దేశ్యమని సుమన్ కుమార్ తెలిపారు.

Krishna District: టెన్త్ విద్యార్థులకు 10 గ్రాముల బంగారం ఫ్రీ

Read Also: AP Government: ఈసారి ముందుగానే పింఛన్ల పంపిణీ

ఉంగుటూరు జెడ్పీ స్కూల్‌లో వినూత్న ప్రోత్సాహం

సుమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. (Krishna District) కేవలం పదో తరగతికే కాకుండా 6 నుంచి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు కూడా ఆయన ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఆయా తరగతుల్లో వార్షిక పరీక్షల్లో మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు, వారు చదువుతున్న తరగతికి సమానంగా అన్ని గ్రాముల బంగారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచి, వారిని చదువులో ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుమన్ కుమార్ వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.