అనంతపురం: రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ (Abdul Aziz)వక్స్ ఆస్తులను పరిరక్షించాలని సదుద్దేశంతో ‘రాష్ట్రవ్యాప్తంగా వక్స్ ప్రొటెక్షన్ ఫోరం సమావేశములు అన్ని జిల్లాలలో జరపాలని వక్స్ బోర్డ్ సీఈఓను దేశించినా ప్రతి జిల్లాలోని జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా డిఎండబ్ల్యూ అధికారులు వక్స్ ప్రొటెక్షన్ ఫోరం సమావేశములు జరపకుండా తగిన శ్రద్ధ చూపకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని రాష్ట్ర ముతవలీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఎం షకీల్ షఫీ ఒక ప్రకటనలో వెల్లడించారు.
వక్స్ ఆస్తులు పరిరక్షణ సమావేశములు
ప్రతి జిల్లాలోనూ వక్స్ ఆస్తులు పరిరక్షణ సమావేశములు నిర్వహించకుండా జిల్లా కలెక్టర్లు బిజీగా ఉన్నారని తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ల్యాండ్ గ్లాబర్లు, రాజకీయ నాయకుల కబంధ హస్తాలలో ఉన్న వక్స్ స్థలాలను కాపాడడం మరిచిపోయి వారికి వత్తాసు పలుకుతూ వక్స్ పరిరక్షణ సమావేశాలు (waqf conservation meetings)ఆయా జిల్లాలలో నిర్వర్తించకపోవడం చాలా శోచనీయం అని ఆయన ఆరోపించారు. రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ అజీజ్, సీఎంవో ఆఫీసు అధికారులు తక్షణమే స్పందించి అన్ని జిల్లాల కలెక్టర్లకు తప్పకుండా వక్స్ ప్రొటెక్షన్ ఫోరం సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజప్తి చేశారు.
తద్వారా జిల్లాలలో, తాలూకాలలో మండలాలలో తగిన కార్యచరణ చేసి వక్స్ స్థలాలు కాపాడాలి అన్న నిర్ణయానికి రావలసిన అవసరం ఎంతైనా ఉందని తప్పకుండా ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన షెడ్యూల్ ప్రకారం జిల్లా కలెక్టర్లు తూచా తప్పకుండా సమావేశాలు నిర్వర్తించాలని రాష్ట్ర వక్స్ బోర్డ్ ముతవల్లిల సంఘం తరపున అధ్యక్షులు కేయం షకిల్ షఫీ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 23 నుంచి డిసెంబర్ 15 వరకు అన్ని జిల్లాల్లోవక్స్ ప్రొడక్షన్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర వక్స్ బోర్డు ఒక షెడ్యూల్ తయారుచేసి అన్ని జిల్లాలకు పంపినట్లు ఆయన వెల్లడించారు.ఆ షెడ్యూల్ ప్రకారం అన్ని జిల్లాల్లో వక్స్ ప్రొటెక్షన్ సమావేశాలు నిర్వహినకు ఆయా జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: