ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు దిశగా కూటమి నేతలు కసరత్తు వేగవంతం చేసారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న వేళ పథకాల అమలుకు ఇక ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. సూపర్ సిక్స్ పథకాల్లో(Super Six schemes) కీలకమైన తల్లికి వందనం జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యేలోగానే అమలు చేయాలని నిర్ణయించారు. కేంద్రం ఈ సారి అమలు చేసే పీఎం కిసాన్ పథకంతో పాటుగా తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులు రైతు ల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తున్నారు. మహిళల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీపం 2 పథకం(Deepam 2 scheme)కింద అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. 2024 అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించారు. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం తెచ్చింది.ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తోంది. మొదటి సిలిండర్ అక్టోబర్ 31 నుంచి మార్చి 31 వరకు. రెండో సిలిండర్ ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ జులై 1 నుంచి నవంబర్ 30 వరకు అందిస్తున్నారు.
ప్రభుత్వం
లబ్ధిదారులు సాధారణ విధానంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసి, మొదట డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోగా గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం(AP Government) లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తూ వస్తోంది. పట్టణాల్లో 24 గంటల్లో, పల్లెల్లో 48 గంటల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తున్నారు. అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం నగదు చెల్లింపుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేరే ఆలోచన చేస్తోంది.తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం(Free gas cylinder scheme లబ్ధిదారుల ఖాతాల్లో సిలిండర్ బుకింగ్ కంటే ముందే నగదు చెల్లించాలని నిర్ణయించినట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏడాదిలో ఉచితంగా అందించే 3 సిలిండర్ల నగదును ఒకేసారి చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నా, సిలిండర్ తీసుకోకపోయినా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల నగదును ఒకేసారి వారి బ్యాంకు ఖాతాలో వేయాలని నిర్ణయించుకున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.ఏపీలో ఉచిత సిలెండర్ల పథకం అమలుకు ఏటా రూ.2684.75 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఏడాదిలో అర్హత కలిగిన లబ్దిదారుకి మూడు సిలిండర్ల ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు తొలుత సిలిండర్ తీసుకునే సమయంలో లబ్ది దారులు నగదు చెల్లించాల్సి వస్తోంది. ఆ తరువాత వారి ఖాతాల్లో ఆ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. కొత్త విధానం అమల్లోకి వస్తే ముందుగానే లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ కానుంది.
Read Also : Andhra Pradesh: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం