ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో పరిణామాలు ఒకేసారి ఉద్రిక్త మలుపులు తిరిగాయి. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గత సంవత్సరం నుంచి తాడిపత్రికి దూరంగా ఉన్న నేపథ్యంలో, తాజాగా ఆయన ఊహించని రీతిలో తాడిపత్రిలోని తన స్వగృహానికి వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి ఆయన్ను అదుపులోకి తీసుకోవడం స్థానికంగా తీవ్ర ఉత్కంఠను రేపింది.ఇదిలా ఉండగానే కేతిరెడ్డి రాక గురించి తెలుసుకున్న జేసీ వర్గీయులు ఆయన తాడిపత్రి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.కేతిరెడ్డి వచ్చిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి. తన అనుచరులతో కలిసి పెద్దారెడ్డి (Peddareddy) ఇంటికి బయలు దేరారు. మరోవైపు కేతిరెడ్డి వచ్చిన విషయం తెలుసుకున్న పరిసర గ్రామాల టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటికి వద్దకు చేరుకున్నారు.
ఆయనను అదుపులోకి తీసుకుని అనంతపురం
కేతిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో కేతిరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాల దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిణామాలు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేతిరెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకుని అనంతపురం తీసుకెళ్లారు.కేతిరెడ్డికి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఉంది. అయితే న్యాయస్థానం ఆదేశాలు పాటించకపోవడంతో, కొన్నిరోజుల క్రితమే ఆయన కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగానే కేతిరెడ్డి తన ఇంటికి రావడంతో తాడిపత్రి (Tadipatri) లో టెన్షన్ నెలకొంది. కేతిరెడ్డి తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తాడిపత్రి రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తాడిపత్రిలోని ఆయన నివాసంలోనే కేతిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి అనంతపురం తరలిస్తున్నారు. జిల్లాలో శాంతి భద్రతల సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.
కేతిరెడ్డిని తాడిపత్రి రాకుండా అడ్డుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాను విజయం సాధించినా లేక ఓడిపోయినా సరే, తాడిపత్రిలో మాత్రం ఫ్యాక్షనిజం చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలోనే టీడీపీ నేతలు గత కొంత కాలంగా కేతిరెడ్డిని తాడిపత్రి రాకుండా అడ్డుకుంటున్నారు. దీనిలో భాగంగానే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ కేతిరెడ్డిని తాడిపత్రికి రానివ్వబోనని గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై కేతిరెడ్డి (Kethireddy) హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకే తాను తన నివాసానికి వచ్చానని, కొద్ది సేపటికే పోలీసులు తనను అదుపులోకి తీసకున్నారని కేతిరెడ్డి తెలిపారు. ఇక ఆదివారం నాడు ఆయన తన నివాసంలో ప్రత్యక్ష్యం కావడంతో, తాడిపత్రిలో పొలిటికల్ టెన్షన్ రాజుకుంది. పోలీసులు తాడిపత్రి పట్టణంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా చూడటం కోసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Read Also: Rain: జూలై 1 నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు