Jewelry Shop Theft: రూ.1.50 కోట్లు విలువ చేసే నగలు కొట్టేశాడు

Read Time:  1 min
Jewelry Shop Theft: రూ.1.50 కోట్లు విలువ చేసే నగలు కొట్టేశాడు
FONT SIZE
GET APP

ఘనమైన వివాహంతో గుమస్తా మోసం వెలుగులోకి

Jewelry Shop Theft: కృష్ణా జిల్లా పెడనలోని ఓ ప్రముఖ నగల దుకాణంలో పనిచేసే గుమస్తా భారీ మోసానికి పాల్పడ్డాడు. యజమానుల నమ్మకాన్ని అవకాశంగా తీసుకుని సుమారు రూ.1.50 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను మాయం చేశాడు. ఇటీవల అతను చేసుకున్న ఘనమైన వివాహమే ఈ బాగోతాన్ని బయటపడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read Also: Kurnool: ఎగ్జామ్ హాల్‌లో గుండెపోటుతో చీఫ్ సూపరింటెండెంట్ మృతి!

Jewelry Shop Theft: రూ.1.50 కోట్లు విలువ చేసే నగలు కొట్టేశాడు
Jewelry Shop Theft: Jewelry Worth ₹1.50 Crores Stolen

దొంగతనం జరిగిన తీరు

వివరాల్లోకి వెళితే.. పెడనకు చెందిన ఓ యువకుడు స్థానిక నగల దుకాణంలో ప్రధాన గుమస్తాగా పనిచేస్తున్నాడు. దుకాణ యజమానులు మరోచోట నివసిస్తుండటంతో, ఇదే అదనుగా కొంతకాలంగా దుకాణంలోని ఆభరణాలను పక్కదారి పట్టిసున్నాడు. సుమారు నెల రోజుల క్రితం ఆ యువకుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తన స్థాయికి మించి అతడు ఖర్చు చేయడాన్ని గమనించిన యజమానులకు అనుమానం కలిగింది. వెంటనే వారు దుకాణానికి వచ్చి స్టాక్ లెక్కలు సరిచూసుకోగా, భారీగా తేడా ఉన్నట్లు గుర్తించారు. గుమస్తాను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. యజమానులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, కేసు ఇంకా నమోదు కాలేదని, పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యజమానులు యువకుడి ఇంటి నుంచి కొన్ని వెండి వస్తువులను, లక్షల్లో నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.