📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

అసెంబ్లీ సమావేశాల నుంచి జగన్ వాకౌట్

Author Icon By Vanipushpa
Updated: February 24, 2025 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం తో ఈ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్ సహా వైసీపీ సభ్యులు హాజ రయ్యారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన తరువాత పోడియం వద్దకు వచ్చిన వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా పై నినాదాలు చేసారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ స్లోగన్స్ ఇచ్చారు. ఆ తరువాత కాసేపటికే జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేసారు.
వైసీపీ సభ్యుల నిరసన
సభలో జగన్ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ లక్ష్యాను వివరించారు. గత ప్రభుత్వంలో వైఫల్యాల గురించి ప్రస్తావన చేసారు. సభ ప్రారంభం సమయానికి తన పార్టీ ఎమ్మెల్సీలు – ఎమ్మె ల్యేలతో కలిసి సభా ప్రాంగణానికి జగన్ చేరుకున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన కొద్ది సేపటికే సభలో వైసీపీ సభ్యుల నిరసన మొదలైంది. పోడియం వద్దకు వచ్చి ప్రతిపక్ష హోదా కల్పించాలి.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అంటూ సభ్యులు నినాదాలు చేసారు. వైసీపీ సభ్యుల నిరసన మధ్యనే గవర్నర్ తన ప్రసంగం కొనసాగించారు.


వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్
వైసీపీ వాకౌట్ సభ్యులు నిరసన చేస్తున్న సమయంలో జగన్, బొత్సా తమ సీట్ల వద్ద నిలబడి మద్దతు ఇచ్చారు. కొద్ది సేపటి నుంచి జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేసారు. సభ జరుగుతున్న సమయంలో జగన్ తన పార్టీ సభ్యులతో కలిసి సభలో కూర్చోవటం.. వాకౌట్ నిర్ణయం ముందు బొత్సాకు చేస్తున్న సూచనల వీడియో వైరల్ అవుతోంది. ఈ రోజు గవర్నర్ ప్రసంగం తరువాత సభ వాయిదా పడనుంది. వెంటనే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఏ అంశాల పైన చర్చించాలనే విషయం పైన నిర్ణయం తీసుకోనున్నారు.

మూడు వారాల పాటు సభ

దాదాపు మూడు వారాల పాటు సభ నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
28న బడ్జెట్ రేపు (మంగళవారం) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం పై చర్చ జరగనుంది. సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. ఆ తరువాత రెండు రోజులు సభ వాయిడా పడనుంది. తిరిగి 28న సభలో ప్రభుత్వం 202-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. బడ్జెట్ కు వైసీపీ సభ్యులు హాజరవుతారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. జగన్ రేపటి నుంచి రెండు రోజులు పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక, జగన్ ఈ సమావేశాలకు వస్తారా లేదా అనేది పార్టీ నేతలకు స్పష్టత లేదు. బడ్జెట్ వేళ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu from assembly meetings Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today walkout YS Jagan Mohan Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.