📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

పోసాని అరెస్టుపై జగన్ స్పందన

Author Icon By Anusha
Updated: February 27, 2025 • 3:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఆయన పై పలు కేసులు నమోదయ్యాయి. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, ఇతర నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పోసానిపై తాజాగా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోలీసులు నిన్న హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేసి తరలించారు. నేడు కోర్టులో హాజరుపర్చిన అనంతరం రిమాండ్‌కు పంపే అవకాశం ఉంది.

జగన్ స్పందన

జగన్ పోసాని కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. “దేవుడు అన్నీ చూస్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి. మేమంతా మీకు తోడుగా ఉంటాం” అని భరోసా ఇచ్చారు. ఈ కేసులో పోసానికి న్యాయపరమైన సహాయం అందించేందుకు ఇప్పటికే వైసీపీ న్యాయవాదుల బృందాన్ని నియమించామని, రాబోయే రోజుల్లో పోసానిపై పెట్టిన కేసులను చట్టపరంగా ఎదుర్కొనేందుకు పూర్తి మద్దతుగా ఉంటామని చెప్పారు.ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని జగన్ ఆమెకు తెలిపారు. ఆలోపు మనోధైర్యంతో ఉండాలని ఆమెకు సూచించారు.

పోసాని అరెస్టును వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది కక్ష సాధింపు చర్య అని ఆరోపించారు. “గత ప్రభుత్వం సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఎవరు విమర్శలు చేసినా వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన వారిపై ఊహించని వేధింపులు మొదలయ్యాయి” అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.మరోవైపు పోసాని అరెస్టుపై జగన్ వైసీపీలో సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీలో జీవీ రెడ్డి ఎపిసోడ్ తర్వాత చోటు చేసుకున్న ఈ అరెస్టు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని వారితో జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇవాళ అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ కు తీసుకువచ్చి పోసాానిని ప్రాథమికంగా విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు సిద్దమవుతున్న నేపథ్యంలో వైసీపీ లాయర్లు అక్కడికి బయలుదేరినట్లు తెలుస్తోంది.

కేసు వివరాలు

జనసేన నేత జోగిమణి ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణమురళిపై 196, 353 (2), రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలోనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, అనంతరం అన్నమయ్య జిల్లాకు తరలించారు.

పోసాని అరెస్ట్‌తో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఒకవైపు కూటమి ప్రభుత్వం న్యాయపరంగా అన్ని కోణాల్లో కేసులను పరిశీలిస్తుందని చెబుతుండగా, మరోవైపు వైసీపీ ఈ చర్యలను తీవ్రంగా తప్పుబడుతోంది. పోసాని వ్యవహారం ఏపీలో మళ్లీ కొత్త రాజకీయ వివాదానికి తెరతీసేలా కనిపిస్తోంది.

#AndhraPolitics #BreakingNews #Janasena #PoliticalNews #PosaniArrest #TDP #ycp #YSJagan Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.