📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

జగన్ భారీ అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారు:బొలిశెట్టి శ్రీనివాస్

Author Icon By Sharanya
Updated: April 7, 2025 • 4:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కృషితో ఎంపీగానో, ఎమ్మెల్యేగానో ఎదగలేదని జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆయన కుటుంబానికి కోట్ల రూపాయల అక్రమాస్తులు వచ్చాయని ఆరోపించారు. జగన్ ఆస్తులు రాజశేఖరరెడ్డి సీఎం కావడానికి ముందు ఎంత? తర్వాత ఎంత? అని ప్రశ్నించారు. బొలిశెట్టి మాట్లాడుతూ, “కోట్లు మంది రైతు కుటుంబాలకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అండగా ఉన్నారు. జగన్ సొంత నియోజకవర్గం అయిన పులివెందుల రైతులకు కూడా పవన్ అండగా నిలబడ్డారు.” అని చెప్పారు.

వైసీపీపై తీవ్ర విమర్శలు

వైసీపీ మాదిరిగా ప్రతీ ఎన్నికల ముందు ఓ స్టంట్ వేసే అలవాటు కూటమి పార్టీలకు లేదు అని బొలిశెట్టి అన్నారు. కోడికత్తి కేసు, బాబాయ్ హత్య డ్రామాలు ఆడి జగన్ అధికారంలోకి వచ్చారని తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో గులకరాయి నాటకం కూడా రిపీట్ అయ్యిందని, ఈసారి ప్రజలు జగన్ ఆటలను నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ చేయకుండా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. జనసేన నేతలు నేరుగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారని, వైసీపీ మాత్రం అసెంబ్లీకి రాకుండా ప్రజలను మోసగిస్తున్నదని చెప్పారు. పేర్ని నాని, రంగనాథ్ రాజు, చంద్రశేఖర్ రెడ్డిలు బియ్యం దొంగలు కాదా అని ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్ అక్రమ బియ్యం రవాణాను అడ్డుకున్నారని, కానీ వైసీపీ ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదని, డయాఫ్రం వాల్ అంటే కూడా తెలియదని ఎద్దేవా చేశారు. వైసీపీ పార్టీ పాలనలో రాష్ట్రం ఐదేళ్లుగా చీకటిలో మగ్గిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీని పాకిస్తాన్ లాగా, జనసేన-టీడీపీ కూటమిని ఇండియా లాగా పోల్చారు. 2024 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించే సమయం వచ్చిందని చెప్పారు. రుషికొండలో జగన్ పెద్ద ప్యాలెస్ కట్టుకోవడానికి కారణమేంటి?” అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ప్రజా డబ్బును దోచుకుని రుషికొండ లాంటి ప్రదేశాల్లో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ పాకిస్థాన్ లాంటిదని కూటమి ఇండియా లాంటిదని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఐదేళ్లు చీకటిలో మగ్గిపోయిందని విమర్శించారు.

#AndhraPradesh #BolisettySrinivas #Elections2024 #PawanKalyan #PoliticalNews #RishikondaPalace #TDPAlliance #YSJagan #YSRCP Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.