శ్రీకాళహస్తి IIT Tirupati : తిరుపతి ఐఐటిలో మరో కొత్త డిగ్రీ కోర్సుకు (Degree course) శ్రీకారం చుట్టారు. తిరుపతి ఐఐటిలో డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ సారధ్యంలో ఒక్కొక్క అడుగు ముందుకు నడుస్తుంది. ఈ నేపధ్యంలో శుక్రవారం అడ్డాన్స్డ్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ ఇండస్ట్రీ-స్పాన్సర్ ఎంటెక్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలకు ఐఐటికి చెందిన అరుణ్కుమార్ తంగిరాల, శశిధర్ గుమ్మాలు ప్రారంభించారు. తిరుపతి ఐఐటిలో అడ్వాన్స్డ్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీలో మార్గదర్శక ఎంటెక్ ప్రోగ్రామ్లో తన మార్గదర్శక ఎంటెక్ ప్రోగ్రాం అధికారికంగా ప్రారంభించారు. ఇది స్థిరమైన మరియు తదుపరి తరం ఇంధన పరిష్కారాల వైపు ప్రపంచ ధోరణులకు అనుగుణంగా ఉండే ఒక ప్రధాన విద్యా కార్యక్రమం అని వక్తలు వివరించారు. రెండు రోజలు ఓరియంటేషన్ కార్యక్రమాలు: తిరుపతి ఐఐటిలో (IIT Tirupati) రెండు రోజుల ఓరియంటేషన్ ప్రోగ్రాం కెరీర్ డెవపల్మెంట్ అండ్ ఔట్రీచ్ డీన్ ప్రొఫేసర్ అరుణ్ కుమార్ తంగిరాల కొర్పొరేట్ రిలేషన్స్ డీన్ ప్రొఫేసర్ శశిధర్ గుమ్మ ప్రారంభం వ్యాఖ్యలతో ప్రారంభించారు. డైరెక్టర్ ప్రొఫేసర్ కె.యన్ సత్యనారాయణ కొత్తగా వచ్చిన విద్యార్థులకు సంస్థ లక్ష్యాలను, విలువలు, విజయాల గురించి వివరించారు. విద్యానైపుణ్యాలు పరిశ్రమల ఔచిత్యం గురించి అంచనాలు నిర్దేశించారు.

ఇంధన నిల్వపై పరిశ్రమ నేతల చర్చలు
ఈ కార్యక్రమాల్లో ఒక ప్రత్యేక ఎహైలెట్ పరిశ్రమ నాయకుల చురుకైన భాగస్వామ్యం వారు ఇందన నిల్వయొక్క ప్రస్తుత మరియు భవిష్యత్తు డిమాండ్లపై విభిన్న ధృక్కోణాలను అందించారు. గ్రూప్ అపరేషన్స్ కు కావలసిన అవసరాన్ని పంచుకున్నారు. జేయస్ డబ్ల్యు అధిపతి అశ్విన్ బజాజ్ (Ashwin Bajaj) మాట్లాడుతూ భారత దేశ పునరుత్పాదక ఇంధన పరివర్తనలో అధునాతన ఇంధన నిల్వఅత్యవసర అవసరానిన వివరించారు. అమర్రాజా ఎనర్జీ మరియు మొబిలిటి లిమిటెడ్ విజయానంద్ ఎస్ మాట్లాడుతూ వేగవంతమైన సాంకేతిక మార్పులు, బ్యాటరీలు, హైబ్రిడ్ వ్యవస్థలపై దృష్టి సారించటం కార్యాచరణ, పర్యావరణ లక్ష్మాలను చేరుకోవటానికి అవిష్కరణ లక్ష్యాలను చేరుకోవటానికి అవిష్కరణ ప్రాముఖ్యత గురించి చర్చించారు. జేయస్ఆడబ్ల్యు వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ యశోధన్ ప్రమోద్ మాట్లాడుతూ ప్రపంచ ఉత్తమ పద్దతులను తాజా సాంకేతిక, నియంత్ర ప్రమా ణాలతో పాఠ్యాంశాలను సమలేఖనం చేయవలసిన అవసరాన్ని పంచుకున్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :