Hyderabad: సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

Read Time:  1 min
Huge crowds at the Panthangi toll plaza
Huge crowds at the Panthangi toll plaza
FONT SIZE
GET APP

సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్నం వాసులు పెద్ద సంఖ్యలో పల్లెబాట పట్టారు. వరుస సెలవులు రావడంతో హైదరాబాద్ (Hyderabad) నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణించే వాహనాలు భారీగా పెరిగాయి. దీనివల్ల పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆదివారం భారీ వాహన రద్దీ నెలకొంది. టోల్ ప్లాజా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, నిన్న ఒక్కరోజే సిటీ నుంచి ఏపీకి సుమారు 60 వేల వాహనాలు వెళ్లాయి.

Read also: Happy Sankranti : సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం

సొంతూర్లకు వెళ్లే వారు అధికంగా ఉండటంతో

ఆదివారం కావడంతో ఈరోజు రద్దీ మరింత పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలతో కలిసి సొంతూర్లకు వెళ్లే వారు అధికంగా ఉండటంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ముఖ్యంగా సొంత వాహనాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరగడం ట్రాఫిక్‌పై ప్రభావం చూపుతోంది.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ సమీపంలో కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రద్దీని తగ్గించేందుకు ఏపీ వైపు వెళ్లే వాహనాల కోసం అదనపు టోల్ బూత్‌లు తెరిచినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ముందస్తు ప్రణాళికతో ప్రయాణించాలని, ట్రాఫిక్ పరిస్థితులను గమనిస్తూ రోడ్డు మీదకు రావాలని సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.