📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Heritage Curd: పెరుగు ప్యాకెట్ ల విషయం లో హెరిటేజ్ వివరణ

Author Icon By Anusha
Updated: May 9, 2025 • 4:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల ఒడిశాలో హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన పెరుగు విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.కొందరు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన జరిగిందని ప్రచారం చేశారు. డేట్ పూర్తైన పెరుగు ప్యాకెట్లను అమ్ముతున్నారంటూ హెరిటేజ్‌పై(Heritage) విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో హెరిటేజ్ ఫుడ్స్ స్పందించింది తమ సంస్థ ఉత్పత్తుల విషయంలో వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుంటుందని తెలిపింది. FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తామన్నారు. ఒడిశాలోని జయపురంలో గడువు ముగిసిన పెరుగు ప్యాకెట్లు అమ్మిన ఘటనపై ప్రకటన విడుదల చేసింది. ఒడిశాలో కొంతమంది షాపుల నిర్వహకులు పెరుగు ప్యాకెట్ల విషయంలో సరైన నిల్వ పద్ధతులు పాటించకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని తెలిపింది.ఒడిశాలో షాపు నిర్వహిస్తున్న వ్యక్తి పెరుగును నిల్వ ఉంచేందుకు సరైన పద్ధతులు పాటించకపోవడం, గడువు ముగిసిన ఉత్పత్తుల్ని అమ్మడం వల్లే సమస్య వచ్చిందని అధికారులు గుర్తించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. మా హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ తరపున ఒక బృందం జయపురానికి వెళ్లింది. వినియోగదారుల ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని మార్కెట్లలో తరచూ తనిఖీలు(Inspections)చేస్తాము. కొందరు కావాలనే నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారు.వాటిని ప్రజలు నమ్మొద్దు. గడువు ముగిసిన లేదా దెబ్బతిన్న ఉత్పత్తులను గమనిస్తే వెంటనే కస్టమర్ కేర్‌కు తెలియజేయాలి. హెరిటేజ్‌కు చెడ్డపేరు తేవాలన్న దురుద్దేశంతో కొందరు కావాలనే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు, వాటిని నమ్మొద్దు’ అని హెరిటేజ్ సంస్థ తెలిపింది. వినియోగదారుల భద్రతకు తమ సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది.

Heritage Curd

హెరిటేజ్ ఫుడ్స్

ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకు హెరిటేజ్ సంస్థ నుంచి పెరుగు ప్యాకెట్లు పంపారు. జయపురలో కొరాపుట్‌ జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి హెరిటేజ్‌ ఉత్పత్తులు విక్రయిస్తున్న షాపులపై మెరుపు దాడులు చేశారు. ఎంజీ రోడ్డు, మెయిన్‌ రోడ్డు, సంగీత జంక్షన్‌ల వద్ద జరిపిన సోదాల్లో కాలం చెల్లిన పాడైన పెరుగు ప్యాకెట్లు ఉన్నట్లు గర్తించారు. డేట్ పూర్తైన పెరుగు ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ షాపుల యజమానులకు జరిమానాను విధించారు.ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.దీంతో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ స్పందించింది.దీనిపై క్లారిటీ ఇచ్చింది. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఒడిశా ఘటనలో ఆ షాపు యజమాని పాడైపోయిన ప్యాకెట్లను నిల్వ ఉంచి అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు.అది ఆ షాపు యజమాని చేసిన తప్పుగా వివరించారు.

Read Also: TTD: తిరుమలలో ఫుడ్‌సేఫ్టీ ల్యాబ్‌ ఏర్పాటుకు నోటిఫికేషన్‌

#ConsumerSafety #FoodQuality #HeritageFoods #OdishaIncident #YogurtExpiryControversy Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.