📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Rain: ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు

Author Icon By Anusha
Updated: May 21, 2025 • 11:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ నెల 23 లేదా 24 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించడానికి పరిస్థితులు అత్యంత అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ వెల్లడించింది.ప్రస్తుతం దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, లక్షద్వీపుల దగ్గర నైరుతీ రుతుపవనాలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.ఈ నెల 26 నాటికి రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.సాధారణంగా జూన్ 1 తర్వాత నైరుతి రుతుపవనాలు(Southwest monsoon) కేరళను తాకుతాయి. కానీ ఈ ఏడాది అంతకంటే ముందే కేరళకు రుతుపవనాలు రానున్నాయని అధికారులు తెలిపారు. గతేడాది కూడా ఇదే సమయంలో రుతుపవనాలు కేరళ, ఈశాన్య రాష్ట్రాలను తాకినట్లు వెల్లడించారు. ఇలా ఒకేసారి రుతుపవనాలు కేరళ తీరం, ఈశాన్య ప్రాంతాలను తాకడం చాలా అరుదని ఈ ఏడాది అలా జరగబోతోందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. 2017లోనూ ఇలాంటి సందర్భమే ఎదురైందని పేర్కొన్నారు.

Rain: ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు

సాగుభూమి

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ(IMD) అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా, పశ్చిమ గోదావరి, నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.అటు తెలంగాణలో(telangana)నూ ఈ నెల 24 వరకూ ఉదయం చల్లబడి ఉంటుంది.హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాత్రివేళల్లో అధిక వర్షం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.గత రెండు రోజులుగా తెలంగాణలో 32 నుంచి 34 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. రామగుండం, ఆదిలాబాద్, జగిత్యాలలో 35 డిగ్రీల సెల్సియస్ ఉంటోంది. ఏపీలో 30 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ ఉంటోందని అధికారులు తెలిపారు. తిరుపతి, చిత్తూరు సహా తూర్పు రాయలసీమలో మాత్రం 33 డిగ్రీల సెల్సియస్ ఉంటోందన్నారు.ఇప్పటికే మన దేశంలో సాగుభూమిలో 52 శాతం వర్షపాతమే ప్రధాన ఆధారం. మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో సాగు భూమి నుంచి ఏకంగా 40 శాతం దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి ముఖ్యమైన జలాశయాలను తిరిగి నింపడానికి ఇవి ఆధారంగా ఉన్నాయి. అంతేకాకుండా దేశ జీడీపీకి 18.2 శాతం తోడ్పాటుకు ఇది ఎంతో ముఖ్యం.

Read Also: Andhra Pradesh: తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్

#IMDUpdate #KeralaRains #Monsoon2025 #SouthwestMonsoon #WeatherAlert Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.