📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra pradesh: ఆంధ్రాలో హాల్ట్ స్టేషన్లు..

Author Icon By Anusha
Updated: April 8, 2025 • 11:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వేసవి సెలవులు ప్రారంభమయ్యే వేళ పుణ్యక్షేత్రాల సందర్శనకు భక్తులు, పర్యాటకులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఇది ఒక మంచి అవకాశం. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. వేసవి సెలవులలో అనేక మంది పుణ్య క్షేత్రాలు, అలాగే టూర్లకు వెళ్తుంటారు.ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.ఇప్పుడు తాజాగా మరో ప్రత్యేక రైలు సర్వీసును ప్రకటించారు అధికారులు.చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. ఈ వేసవి సీజన్ పొడవునా అంటే మే 31వ తేదీ వరకు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. చర్లపల్లి నుంచి తిరుపతికి మొత్తం 16 రైలు సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. ఈ నెల 11వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు ప్రతి శుక్ర, ఆదివారాలు అంటే- ఏప్రిల్ 13, 18, 20, 25, 27, మే 2, 4, 9, 11, 16,18, 23, 25, 30 తేదీల్లో రాత్రి 9: 35 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07017 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 10:10 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది.

ప్రత్యేక రైలు

తిరుగు ప్రయాణంలో ఈ నెల 12వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ప్రతి ఆది, మంగళవారాలు అంటే- 14, 19, 21, 26, 28, మే 3, 5, 10, 12, 17, 19, 24, 26, 31 తేదీల్లో సాయంత్రం 4:40 నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరే నంబర్ 07018 నంబర్ ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 7: 10 నిమిషాలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.మల్కాజ్‌గిరి, కాచిగూడ, ఊందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

చర్లపల్లి

సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యామ్నాయంగా చర్లపల్లిని కొత్త రైల్వే టర్మినల్‌గా అభివృద్ధి చేసింది. తొమ్మిది ప్లాట్ఫార్మ్‌లు, ఆధునిక వసతులతో ఈ స్టేషన్‌ను తీర్చిదిద్దారు. దాదాపు 450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ టర్మినల్ ఇప్పటికే పలు రెగ్యులర్, స్పెషల్ రైళ్లకు హబ్‌గా మారింది.ఈ నేపథ్యంలో చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు ప్రకటించటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Hyderabad: శ్రీవారి భక్తులకు శుభవార్త! హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్ల సౌకర్యం

#CharlapalliToTirupati #HolidayTravel #IndianRailways #Secunderabad #southcentralrailway #SummerSpecialTrains #TirupatiTrains Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.