ఏపీలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవల చెప్పినట్లుగానే జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకులు మెప్మా లోన్ ఛార్జ్ క్రియేషన్ (ఎంఎల్సీసీ) యాప్ ద్వారా రుణాలు ఇస్తాయి.ఇకపై నేరుగా రుణాలు ఇవ్వడం కుదరదు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలలో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి మెప్మా కొత్తగా యాప్ తీసుకొచ్చింది. తాడేపల్లిలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించగా ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్కుమార్, సంచాలకులు సంపత్కుమార్, మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ తేజ్భరత్ పాల్గొన్నారు.రాష్ట్రంలోని 2.74 లక్షల స్వయం సహాయక సంఘాల(SelfHelpGroups) సమాచారం యాప్లో అందుబాటులో ఉంటుంది.ఈ యాప్ను బ్యాంకులకు అనుసంధానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 24 బ్యాంకులకు చెందిన 2,066 బ్రాంచిలకు లాగిన్లు ఇచ్చారు. ఈ యాప్ ద్వారా రుణాలు ఇవ్వొచ్చని అధికారులు తెలిపారు. పట్టణాల్లో పది వేల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి బ్యాంకులు రుణాలు ఇవ్వాలని సురేశ్కుమార్ కోరారు. బ్యాంకులు రుణాలు ఇచ్చి మహిళలు వ్యాపారాలు చేయడానికి సహాయం అందిస్తాయి. దీని ద్వారా ఎక్కువ మంది మహిళలు సొంతంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వం
ఈ యాప్ ద్వారా స్త్రీనిధి రుణాల వాయిదాలను నగదు రహితంగా చెల్లించవచ్చు. వాయిదాల చెల్లింపులో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఈ చర్య తీసుకుంటున్నారు. రుణ వాయిదాల చెల్లింపుల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించారు. దీనివల్ల లక్షల రూపాయల నగదు పక్కదారి పడుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఈ కసరత్తు చేసింది. ఈ యాప్ ద్వారా బ్యాంకు లింక్, స్త్రీనిధి వంటి రుణాలను సక్రమంగా అందించవచ్చు. స్త్రీనిధి రుణాలు పొందిన లబ్ధిదారులు ఇకపై తమ వాయిదాలను ఎవరికి వారే చెల్లించుకోవచ్చు.కొత్త యాప్(New app) అందుబాటులోకి వస్తే నేరుగా చెల్లింపులు చేయవచ్చు. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది. చెల్లింపుల్లో మోసాలకు అవకాశం ఉండదు. నెలవారీ వాయిదాలను ఆన్లైన్లో సులభంగా చెల్లించవచ్చు. చెల్లింపు చేసిన వెంటనే మొబైల్కు మెసేజ్ వస్తుంది. దీనివల్ల వాయిదా సొమ్ము ఎవరూ స్వాహా చేయలేరు. లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం యాప్లో ఉంటుంది. యాప్ వినియోగంలోకి వస్తే పారదర్శకత పెరుగుతుందంటున్నారు అధికారులు. ఈ యాప్ ద్వారా డ్యాక్రా సంఘాల్లో మహిళలు సులభంగా, సురక్షితంగా తమ రుణ వాయిదాలను చెల్లించవచ్చు అంటున్నారు. మొత్తానికి డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ యాప్ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Andhra Pradesh: భారత ఆర్మీకి మంత్రాలయం మఠం విరాళం