हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Free bus : స్త్రీ శక్తి మహిళ ఉచిత బస్సు ప్రయాణం మార్గదర్శకాలు విడుదల

Shravan
Free bus : స్త్రీ శక్తి మహిళ ఉచిత బస్సు ప్రయాణం మార్గదర్శకాలు విడుదల

విజయవాడ Free bus : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో (RTC Buses) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆర్టీసీ ఎండీని ఆదేశిస్తూ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. స్త్రీ శక్తిపేరిట ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 5 కేటగిరీ బస్సుల్లో ఈ పథకం అందించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అలానే చార్జీపై ప్రభుత్వం ఇస్తోన్న రాయితీ మొత్తాన్ని తెలుపుతూ జీరో ఫేర్ టికెట్ జారీ చేయాలని ఆదేశాల్లో తెలిపింది. తిరుమల- తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఈ పథకం వర్తించదు. నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో కూడా ఉచిత ప్రయాణం వర్తించదు. సప్తగిరి ఎక్స్ ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు ఈ పథకం వర్తించదు. బస్సుల్లో రద్దీ పెరగనున్న దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపింది.

FREE BUS

బస్సుల్లో రద్దీగా ఉన్నప్పుడు కొందరు ప్రయానికులు ఉద్దేశపూర్వకంగా గొడవ పడినా, అమర్యాదకరంగా ప్రవర్తించినా రికార్డు (Record of behavior) చేయనున్నారు. ఏదేని ఘటనలు జరిగినా వీడియోను సమగ్రంగా విశ్లేషించి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. అలానే బస్టాండ్ లో తగిన సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులో స్పష్టం చేసారు. ఈ పథకం పూర్తిగా అమలులో ఉంటుంది: గత ప్రభుత్వం ఆర్టీసీని విచ్చిన్నం చేసిందని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/land-acquisition-forced-land-acquisition-in-the-state-cpm-state-secretary-v-srinivasa-rao/andhra-pradesh/529432/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870