📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: తిరుపతిలో ఫుడ్​సేప్టీ ల్యాబ్​ ఏర్పాటు

Author Icon By Anusha
Updated: April 23, 2025 • 5:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఫుడ్​సేప్టీ ల్యాబ్​ను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆహార కల్తీల గుర్తింపు, వాటి నియంత్రణకు సంబంధించి ఇప్పటివరకు వాటి నమూనాలను ఎంతో వ్యయప్రయాసలకోర్చి హైదరాబాద్‌కు పంపాల్సి వచ్చేది. అనంతరం ఫలితాలు సైతం ఆలస్యంగా రావడంతో చర్యలు తీసుకునేలోగా పుణ్యకాలం పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం నమూనాల స్వీకరణకు నిరాకరిస్తుండటంతో ఐదు రాష్ట్ర స్థాయి ఫుడ్‌ సెఫ్టీ ల్యాబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.తిరుపతిలో ఒకటి, తిరుమలలో టీటీడీ కోసం ప్రత్యేకంగా మరో ల్యాబ్‌ కేటాయించడం విశేషం. తిరుమలలోని ప్రయోగశాలను టీటీడీ అవసరాల కోసమే నిర్దేశించగా తిరుపతిలోని ప్రయోగశాలను రాయలసీమ అవసరాల కోసం వినియోగించనున్నారు. తిరుమలలో 12 వేల చదరపు అడుగుల భవనాన్ని టీటీడీ ఆహార భద్రతాధికారులకు అప్పగించగా రాష్ట్రంలో తొలి ప్రయోగశాల ఇక్కడే ప్రారంభించనున్నారు. టీటీడీకి చెందిన శ్రీదేవి కాంప్లెక్స్‌లో ప్రయోగశాల ఏర్పాటుకు అవసరమైన భవనాన్ని అద్దెకు తీసుకున్నారు.

ప్రయోగశాల

ఒక్కో జిల్లా నుంచి గరిష్ఠంగా 400 వరకు నమూనాల్ని పరీక్షించాల్సి ఉంటుంది. తిరుపతిలోని ప్రయోగశాలలో రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే నాలుగు వేల వరకు నమూనాలు పరీక్షించే వీలుంది. ప్రైవేటు వ్యక్తులు సైతం నమూనాల్ని పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. వీటి ద్వారా ఒక్కొక ప్రయోగశాలకు రూ.25 కోట్ల విలువైన పరికరాలు అందుబాటులోకి రానున్నాయి.ఇప్పటికే దీనికి సంబంధించి,మరోవైపు ప్రాంతీయ ఆహార ప్రయోగశాలలు ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టలేషన్ కోసంటెండర్ల ప్రక్రియ సైతం ముగిసింది. ముఖ్యంగా నూనెలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, తాగునీరు, శీతల పానీయాలు, సుంగంధ వస్తువులు, వంట సరకులు, బేకరీ వస్తువులు వంటి వాటిని 15 విభాగాలుగా విభజించి 400 పైగా కల్తీలను గంటల వ్యవధిలో విశ్లేషించే వీలుంది.

పూర్ణచంద్రరావు మాట్లాడుతూ

“తిరుమలలో త్వరలో, తిరుపతిలో మరో ఆరునెలల్లో ప్రయోగశాలలు ప్రారంభం అవుతాయి. అప్పటికప్పుడు నమూనాలు సేకరించి పరీక్షించి కేసులు నమోదు చేస్తాం. పూర్తిస్థాయిలో కల్తీని నియంత్రించేందుకు రాష్ట్రస్థాయి ప్రయోగశాలలు దోహదపడుతాయి.

Read Also: CM Chandrababu : వీరయ్య చౌదరి భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నివాళులు

#APDevelopment #FoodSafety #FoodSafetyLab #PublicHealth #SafeFood #Tirupati Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.